Webdunia - Bharat's app for daily news and videos

Install App

#farmersprotest ఢిల్లీలో యువ రైతు ఆ పని చేశాడు.. వీడియో వైరల్

Webdunia
శనివారం, 28 నవంబరు 2020 (13:14 IST)
#farmersprotest
ఢిల్లీలో రైతులు ఆందోళనకు చేస్తున్న సంగతి తెలిసిందే. మూడు రోజులుగా వీళ్లు దేశ రాజధానిలో ఈ కొత్త చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వీరిని ఢిల్లీలోకి రాకుండా అడ్డుకోవడానికి పోలీసులు వీరిపైకి టియర్ గ్యాస్‌, వాటర్ కెనాన్‌లు ప్రయోగించారు. అయితే ఈ వాటర్ కెనాన్‌ల నుంచి రైతులను రక్షించడానికి ఓ యువ రైతు ఏకంగా వాటర్ కెనాన్ వాహనంపైకి ఎక్కి దానిని బంద్ చేశాడు. 
 
అలా చేసినందుకు ఇప్పుడు పోలీసులు ఏకంగా అతనిపై హత్యాయత్నం కేసును నమోదు చేయడం గమనార్హం. సోషల్ మీడియా మొత్తం అతన్ని ఓ హీరోగా చూస్తుంటే.. పోలీసులు మాత్రం ఇంత కఠినమైన సెక్షన్ కింద కేసు నమోదు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
ఈ సెక్షన్ కింద గరిష్ఠంగా జీవిత ఖైదు శిక్ష పడే అవకాశం ఉంటుంది. పంజాబ్‌కు చెందిన ఆ 26 ఏళ్ల నవ్‌దీప్ సింగ్ అనే రైతు పోలీసుల తీరుపై మండిపడుతున్నాడు. ఇతడు ఓ రైతుల సంఘం అధ్యక్షుడైన జై సింగ్ కుమారుడు. తాను చదువు పూర్తి చేసిన తర్వాత తండ్రితో కలిసి వ్యవసాయం చేస్తున్నానని, ఇప్పటి వరకు ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడలేదని నవ్‌దీప్ సింగ్ అంటున్నాడు.
 
ఆ జల ఫిరంగులు రైతులను గాయపరుస్తున్నాయన్న ఉద్దేశంతోనే తాను వాటిని ఆఫ్ చేసినట్లు చెప్పాడు. అయితే మొదటి నుంచీ రైతుల పట్ల హర్యానా, ఢిల్లీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారని వారిపై ఆరోపణలు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్ తో స్నేహం వుంది; సుందరకాండ లో స్కూల్ డ్రెస్ మధుర జ్నాపకం : శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments