Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి వ్యాక్సిన్‌ను తెలంగాణకు ఇవ్వాలి.. ఈటెల డిమాండ్

Webdunia
శనివారం, 28 నవంబరు 2020 (12:08 IST)
ప్రపంచమంతా కరోనాకు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. పలు దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్ తయారీలో కీలక దశకు చేరుకున్నాయి. కరోనాకు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడంలో హైదరాబాద్‌లో ఉన్న భారత్‌ బయోటెక్‌, బయోలాజికల్‌-ఈ, తదితర కంపెనీలు నిర్విరామంగా కృషి చేస్తున్నాయి.
 
అయితే నగరం నుండి వ్యాక్సిన్ తయారీ అవుతున్న కారణంగా ముందుగా వ్యాక్సిన్‌ను తెలంగాణ ప్రజలకే ఇవ్వాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ప్రధాని మోడీని ఈటెల కోరారు. ఇక్కడి ప్రజలకు సరిపోయేన్ని డోసులను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 
 
కరోనా భయం పూర్తిగా పోవాలంటే వ్యాక్సిన్‌ ఒక్కటే మార్గం కాబట్టి ప్రజలందరికీ అతి త్వరలో వ్యాక్సిన్‌ అందేలా చూడాలని ప్రధానిని ఈటెల కోరారు. హైదరాబాద్‌ నుంచి వ్యాక్సిన్‌ అభివృద్ధికి భారత్‌ బయోటెక్‌ చేస్తున్న కృషి తుదిదశకు చేరుకుంది. 
 
ఇప్పటికే మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ కొనసాగుతుండగా, వచ్చే రెండు మూడు నెలల్లో పూర్తి వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుంది. ఫార్మారంగానికి తెలంగాణ చూపిన చొరవకు కృతజ్ఞతగా, ప్రపంచానికి కరోనా నుంచి విముక్తి కల్పిస్తున్న సందర్భంగా.. తొలి వ్యాక్సిన్‌ను తమకే ఇవ్వాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments