Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్‌లో హిందూ వైద్యుడిని కత్తులతో పొడిచి చంపిన దుండగులు!

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (18:13 IST)
పాకిస్తాన్‌లో నివసించే హిందువులకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయింది. గతంలో నమ్రత అనే హిందూ వైద్య విద్యార్థినిపై అత్యాచారం జరిపి హత్య చేశారు. ఇపుడు ఓ హిందూ వైద్యుడిని కత్తులతో పొడిచి చంపేశారు. ఈ దారుణం సింధ్ ప్రావిన్స్‌లోని తాండో అల్లిహార్ ప్రాంతంలో జరిగింది. మృతుడు లాల్ చంద్ బాగ్రీ అనే హిందు వైద్యుడిగా గుర్తించారు. 
 
ఈయన గత కొన్నేళ్లుగా తన నివాసంలోనే వైద్య క్లినిక్‌ను నిర్వహిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఆయన తన నివాసంలో ఉండగా, దుండగులు దారుణంగా చంపేశారు. కత్తులతో విచక్షణ రహితంగా పొడిచి, పరారయ్యారు. తీవ్రగాయాలతో డాక్టర్ లాల్ చంద్ ప్రాణాలు విడిచారు.
 
ఈ ఘటనపై పొరుగింటి వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు బాధ్యులు ఎవరన్నది తెలియరాలేదు. డాక్టర్ లాల్ చంద్ హత్య దర్యాప్తులో భాగంగా ఆయన స్నేహితులను పోలీసులు విచారిస్తున్నారు.
 
కాగా, గతేడాది నమ్రతా చందాని అనే జూనియర్ డాక్టర్ కూడా కరాచీ సమీపంలో హత్యకు గురైన విషయం తెల్సిందే. లార్కనాలో ఆమె బీబీ ఆసిఫా మెడికల్ కాలేజీలో వైద్య విద్య అభ్యసిస్తున్నారు. నమ్రత సోదరుడు కరాచీలో శస్త్రచికిత్సల నిపుణుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నమ్రత ఉమెన్స్ హాస్టల్‌లో ఉండగా ఆమెపై అత్యాచారం చేసిన దుండగులు, ఆపై హత్యచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments