Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందు బాబులకు షాకిచ్చిన సర్కారు.. తాగుబోతులు కౌ సెస్ చెల్లించాల్సిందే...

Webdunia
శనివారం, 18 మార్చి 2023 (13:15 IST)
మందు బాబులకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తేరుకోలేని షాకిచ్చింది. ఇకపై మందు బాటిళ్లపై ఆవుల సుంకం (కౌ సెస్) వసూలు చేయాలని నిర్ణయించింది. ఒక్కో బాటిల్‌పై రూ.10 చొప్పున విధిస్తామని తెలిపింది. దీని వల్ల రాష్ట్ర ఖజానాకు రూ.100 కోట్ల మేరకు వస్తాయని, ఈ నిధులను రాష్ట్రంలో పాడిపరిశ్రమల అభివృద్ధికి ఖర్చుచేస్తామని తెలిపింది. 
 
2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ సెస్‌ను వసూలు చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సఖు తెలిపారు. పాడిపరిశ్రమ అభివృద్ధి, పాల ఉత్పత్తిదారుల ఆదాయాన్ని పెంచేందుసు వీలుగా ఆవు, గెదె పాలను కొనుగోలు చేయాలని ఆయన రాష్ట్ర ప్రజలకు పిలుపునివ్వడమే కాకుండా, ప్రభుత్వం కూడా భారీ ఎత్తున వీటిని కొనుగోలుచేయనుంది. ఈ క్రమంలోనే ఆవు సెస్ వసూలు చేయాలని ప్రతపాదించింది.
 
ఇకపోతే, హిమాచల్ ప్రదేశ్ బడ్జెట్ వివరాల్లోకి వెళ్తే.. రూ.53413 కోట్ల బడ్జెట్ ఉంటగా ఇందులో పాడిపరిశ్రమను అభివృద్ధి చేసేందుకు వీలుగా హిం-గంగా ప్రాజెక్టును ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం రూ.500 కోట్ల మేరకు ఖర్చు చేయనున్నారు. ఇందులోభాగంగా, 2.31 లక్షల మంది పాడి రైతులకు రూ.1500 మేరకు వింఛను అందజేస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments