Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం.. విద్యా సంస్థలకు సెలవు

ఠాగూర్
సోమవారం, 8 జనవరి 2024 (11:14 IST)
తమిళనాడు రాష్ట్రాన్ని మరోమారు భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలన్నీ నట మునిగాయి. మరోవైపు, ఈ భారీ వర్షాలు మరో వారం రోజుల పాటు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 
 
ఈ వర్షం కారణంగా రాజధాని చెన్నై నగరంలో వాహనాల రాకపోలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, నాగపట్టణం, విల్లుపురం, కడలూరు, కళ్లకుర్చి, రాణిపే, వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని నాగపట్టణంలోని రెండు తాలూకాలు, విల్లుపురం, తిరువళ్లూరు, కడలూరు జిల్లాల్లోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రటించారు. 
 
మరోవైపు, వచ్చే వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని పది జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, మైలాడుదురై, నాగపట్టణం, తిరువారూరఫ జిల్లాలతో పాటు పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో ఈ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments