Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మళ్లీ కలవరపెడుతున్న కరోనా... పెరుగుతున్న జేఎన్ 1 వేరియంట్

Advertiesment
coronavirus
, గురువారం, 21 డిశెంబరు 2023 (11:48 IST)
దేశంలో కరోనా వైరస్ మళ్లీ కలవరపెడుతుంది. గత కొన్ని రోజులుగా కోవిడ్ జేఎన్ 1 వేరియంట్ కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 358 కేసులు నమోదయ్యాయి. అలాగే, కేరళలో ముగ్గురు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. జీఎన్ 1 కేసుల సంఖ్య కూడా పెరుగుతున్నాయి. 
 
గత 24 గంటల్లో దేశంలో 358 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని దేశంలోని యాక్టివ్ కేసుల సంఖ్య 2666కి పెరిగింది. కేరళలో కోవిడ్ వేరియంట్ జేఎన్ 1 కేసుల గుర్తించిన నేపథ్యంలో కేసులు పెరుగుదల ఆందోళన కలిగిస్తుంది. కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా తాజాగా ముగ్గురు మరణించారు. ఈ మూడు మరణాలు కేరళలోనే నమోదయ్యాయి. తాజా మరణాలతో కలుపుకుని దేశ వ్యాప్తంగా కరోనా కాటుకు బలైనవారి సంఖ్య 5,33,327కు పెరిగింది. 
 
తాజాగా కేరళ, కర్నాటక, గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్రలో నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ శాఖ వెబ్‌సైట్ ప్రకారం కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,44,70,576కు పెరిగింది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతం ఉంది. ఇక కరోనా కొత్త వేరియంట్ జేఎన్1 కేసులు దేశంలో 21 నమోదయ్యాయి. కరోనా మళ్లీ కొత్త రూపంలో బుసలు కొడుతుండటంతో రాష్ట్రాలన్నీ అప్రమత్తమయ్యాయి. కరోనా కట్టడి చర్యలు ప్రారంభించాయి. చాలా రాష్ట్రాలు మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేశాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీ లిక్కర్ స్కామ్ : ఈడీ విచారణకు మళ్లీ డుమ్మాకొట్టిన సీఎం కేజ్రీవాల్