ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు - విద్యా సంస్థల మూసివేత

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2022 (15:27 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కుంభివృష్టి కురుస్తుంది. ఈ కారణంగా అనేక ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. గంగా, యమున వంటి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నారు. దీంతో అనేక లోతట్టు ప్రాంతాన్నీ నీట మునిగాయి. ఈ వరదలో చిక్కుకున్న వర్ష బాధితులను అధికార యంత్రాంగం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది. ఫలితంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో 15 జిల్లాల్లో విద్యా సంస్థలను మూసివేశారు. 
 
ఈ భారీ వర్షం కారణంగా ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్, రాష్ట్ర రాజధాని లక్నో, రాంపూర్, మిరట్ సహా 15 కి పైగా జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలను సోమవారం మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ జిల్లాల్లో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అన్ని పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. ఈ మేరకు జిల్లాల డీఎం ఉత్తర్వులు కూడా జారీ చేశారు. 
 
మరోవైపు, వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అన్ని పాఠశాలలకు అక్టోబరు 10వ తేదీని సెలవులుగా ప్రకటిస్తూ ఘజియాబాద్ డీఎం రాకేష్ కుమార్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. వర్షం హెచ్చరికలో ఘజియాబాద్ ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు. ఈ సమయంలో రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి : రాజ్ నిడిమోరు మాజీ భార్య

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

Allu Arjun : కున్రిన్ పేరుతో జపనీస్ థియేటర్లలోకి అల్లు అర్జున్... పుష్ప 2

Arnold : అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీమియర్‌ చూసి అర్నాల్డ్ ష్వార్జెనెగర్ ప్రశంస

Chiranjeevi: విక్టరీ వెంకటేష్ ఎనర్గి ప్రతి క్షణం ఆనందం కలిగించింది : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments