Webdunia - Bharat's app for daily news and videos

Install App

మండిపోతున్న ఎండలు.. వేసవి సెలవులు పొడగింపు

Webdunia
మంగళవారం, 6 జూన్ 2023 (15:33 IST)
తమిళనాడు రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు ఇచ్చిన వేసవి సెలవులను పొడగించింది. వాస్తవానికి మార్చి, ఏప్రిల్ నెలలో జరిగిన పబ్లిక్ పరీక్షల తర్వాత వేసవి సెలవులు ఇచ్చారు. జూన్ ఒకటో తేదీ స్కూల్స్ తెరుచుకుంటాయని ప్రకటించారు. అయితే, వేసవి ఎండలు తీవ్ర స్థాయిలో ఉండటంతో ఈ సెలవులను తొలుత వారం రోజుల పాటు పొడగించారు. అంటే ఏడో తేదీ నుంచి తెరుస్తామని ప్రకటించారు. 
 
అయినప్పటికీ ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. పైగా, వచ్చే మూడు నాలుగు రోజుల పాటు ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో మరో వారం రోజుల పాటు ఈ సెలవులను పొడగించింది. ఆ ప్రకారంగా ఈ నెల 14వ తేదీ బుధవారానికి వాయిదా వేసింది. 
 
2023-24 విద్యా సంవత్సరానికిగాను ఆరు నుంచి పది తరగతులకు, ఇంటర్ విద్యార్థులకు మాత్రం జూన్ 12వ తేదీన, 1 నుంచి 5వ తరగతులకు చెందిన విద్యార్థులకు జూన్ 14వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభమవుతాయని ఆ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖామంత్రి అన్బిల్ మహేశ్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments