Webdunia - Bharat's app for daily news and videos

Install App

మండిపోతున్న ఎండలు.. వేసవి సెలవులు పొడగింపు

Webdunia
మంగళవారం, 6 జూన్ 2023 (15:33 IST)
తమిళనాడు రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు ఇచ్చిన వేసవి సెలవులను పొడగించింది. వాస్తవానికి మార్చి, ఏప్రిల్ నెలలో జరిగిన పబ్లిక్ పరీక్షల తర్వాత వేసవి సెలవులు ఇచ్చారు. జూన్ ఒకటో తేదీ స్కూల్స్ తెరుచుకుంటాయని ప్రకటించారు. అయితే, వేసవి ఎండలు తీవ్ర స్థాయిలో ఉండటంతో ఈ సెలవులను తొలుత వారం రోజుల పాటు పొడగించారు. అంటే ఏడో తేదీ నుంచి తెరుస్తామని ప్రకటించారు. 
 
అయినప్పటికీ ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. పైగా, వచ్చే మూడు నాలుగు రోజుల పాటు ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో మరో వారం రోజుల పాటు ఈ సెలవులను పొడగించింది. ఆ ప్రకారంగా ఈ నెల 14వ తేదీ బుధవారానికి వాయిదా వేసింది. 
 
2023-24 విద్యా సంవత్సరానికిగాను ఆరు నుంచి పది తరగతులకు, ఇంటర్ విద్యార్థులకు మాత్రం జూన్ 12వ తేదీన, 1 నుంచి 5వ తరగతులకు చెందిన విద్యార్థులకు జూన్ 14వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభమవుతాయని ఆ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖామంత్రి అన్బిల్ మహేశ్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments