Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు.. శుక్రవారం వరకు ఇంతే.. అలెర్ట్

summer
, మంగళవారం, 16 మే 2023 (12:36 IST)
తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారాయి. ఈ నెల 25న రోహిణీ కార్తె మొదలవుతోంది. అప్పుడు ఎండలు మరింత పెరగడం ఖాయం. రోహిణీ కార్తె జూన్ 7 వరకూ ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరాయి. 
 
శుక్రవారం వరకూ ఎండలు తీవ్రంగానే ఉంటాయని వాతావరణ అధికారులు తెలిపారు. దీంతో పాటు వడదెబ్బ తగిలే అవకాశం వుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. 
 
శుక్రవారం రాత్రివేళ కూడా వేడి గాలుల వల్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల దాకా ఉంటాయి. బయటకు వెళ్లేటప్పుడు నీరు తాగి వెళ్లాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతీ అరగంటకు ఓసారి నీరు, మజ్జిగ, నిమ్మరసం, పుదీనా రసం, కొబ్బరి నీళ్లు, జ్యూస్ తీసుకోవాలి. 
 
ఎండలో తిరిగితే మెదడు సరిగ్గా పనిచెయ్యదు. దానికి ఆక్సిజన్ సరిగా అందదు. బాడీ మొత్తం డీహైడ్రేషన్ అయిపోతుంది. కాబట్టి.. నీరు, ద్రవ పదార్థాలు తాగుతూనే ఉండాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ బటన్ నొక్కి ప్రజలకు మేలు చేస్తున్నారు.. ఆయన్నే గౌరవిస్తా : మాజీ మంత్రి బాలినేని