Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందుబాటులోకి వచ్చిన ట్రాక్.. మళ్లీ పెట్టాలెక్కిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్

Webdunia
మంగళవారం, 6 జూన్ 2023 (14:46 IST)
షాలిమార్ - చెన్నై సెంట్రల్ స్టేషన్‌ల మధ్య నడిచే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ వద్ద ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 275 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో వెయ్యిమందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. అయితే, ఈ ప్రమాదం ఆ మార్గంలో నడిచే అనేక రైళ్లను రద్దు చేశారు. ఆ తర్వాత రైల్వే సిబ్బంది రేయింబవుళ్లు శ్రమించి ప్రమాదం కారణంగా దెబ్బతిన్న రెండు ట్రాక్‌ల నిర్మాణం పూర్తి చేశారు. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. 
 
దీంతో మూడు రోజుల తర్వాత చెన్నై - షాలిమార్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు మళ్లీ పట్టాలెక్కింది. ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు రైలు బయలుదేరుతున్నట్టు ఎస్ఎంఎస్ సందేశాలు వెళ్లాయి. సోమవారం ఉదయం 10.45 గంటల సమయంలో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లోని ఐదో నంబరు ఫ్లాట్‌ఫాంపై నుంచి ఈ రైలు షాలిమార్‌కు బయలుదేరివెళ్లింది. అదేవిధంగా తిరుగు ప్రయాణంలో కూడా షాలిమార్ నుంచి చెన్నైకు మరో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ కదిలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments