Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

ఐవీఆర్
శుక్రవారం, 10 జనవరి 2025 (22:37 IST)
ఇదివరకు 50 ఏళ్ల పైబడినవారికి గుండెపోటు వంటివి వచ్చి హఠాన్మరణం చెందే సంఘటనలు చూస్తుండేవాళ్లం. ఇప్పుడు అసలు వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలు కూడా గుండెపోటు సమస్యలతో మృత్యువాత పడుతున్నారు. శుక్రవారం గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాదులోని థాల్తేజ్ ప్రాంతంలోని జెబార్ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న బాలిక గుండెపోటుతో మృతి చెందింది.
 
స్కూలు ఆవరణకు రాగానే చిన్నారి తన ఛాతీలో నొప్పిగా వుందని చెప్పింది. ఇంతలో మిగిలిన విద్యార్థులతో కలిసి కారిడార్లో నడుస్తూ వెళ్లి అస్వస్థతగా వుండటంతో కుర్చీలో కూర్చున్నట్లు సిసి కెమేరాలో కనబడుతోంది. అలా కూర్చున్న చిన్నారి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అది గమనించిన పాఠశాల సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె ప్రాణాలు కోల్పోయింది. చిన్నారికి అనారోగ్య సమస్యలు ఏవీ లేవని ఆమె తల్లిదండ్రులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

తర్వాతి కథనం
Show comments