Webdunia - Bharat's app for daily news and videos

Install App

online games ఆడి అప్పుల్లో ఇరుక్కున్నాడు, అడిగినందుకు భార్యాపిల్లల్ని చంపేసి...

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (18:37 IST)
వ్యసనం అనేది ఎంతటి దారుణానికైనా దారితీస్తుంది. అందులో ఇరుక్కున్నవారికి మానవత్వం నశించి మృగంలా మారిపోతారు. అలాంటి స్థితిలోకి వెళ్లిపోయిన ఓ వ్యక్తి తన భార్యాపిల్లల్ని కడతేర్చి తను కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చెన్నైలోని పెరుంగుడి పెరియార్ నగర్ లోని ఓ అపార్టుమెంటులో మణికంఠన్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో నివాసముంటున్నాడు. చెన్నైలో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న ఇతడు గత రెండు నెలలుగా పనికి వెళ్లకుండా ఇంట్లోనే వుంటూ ఆన్లైన్ గేమ్స్ ఆడటం మొదలుపెట్టాడు.

 
ఇందుకోసం డబ్బును పెట్టి రాబట్టాలని చూసాడు. ఐతే ఆ గేమ్ ఆడుతూ వున్న డబ్బు మొత్తం పోగొట్టుకోవడమే కాకుండా తనకు తెలిసిన వ్యక్తుల వద్ద కూడా అప్పులు చేసాడు. ఈ విషయమై అతడిని భార్య నిలదీసింది. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి భార్యను హత్య చేసేసాడు.

 
ఆ తర్వాత తన ఇద్దరి పిల్లల్ని కూడా దారుణంగా చంపేసి అతడూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన 31వ తేదీ జరగ్గా, తెల్లవారినా తలుపులు తీయకపోవడంతో అనుమానంతో ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారమిచ్చారు. అపార్టుమెంట్ తలుపులు తెరిచి మృతదేహాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments