ఏపీలో 122 మందికి కరోనా పాజిటివ్ - ఒమిక్రాన్ కేసులు నిల్

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (18:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో 122 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 15,568 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా, 122 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. 
 
ఇందులో కృష్ణా జిల్లాలో 19, చిత్తూరు జిల్లాలో 13, గుంటూరు జిల్లాలో 10 కేసులు చొప్పున నమోదయ్యాయి. విజయనగరం, వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
మరోవైపు, రాష్ట్రంలో ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా నమోదు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అదేసమయంలో కరోనా నుంచి 103 మంది కోలుకున్నారు. అయితే, విశాఖలో మాత్రం ఓ కరోనా రోగి ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,77,608 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 1,278 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments