Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెత్త పోలీసింగ్ : ఢిల్లీ పోలీసులపై హైకోర్టు సీరియస్

Webdunia
మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (13:36 IST)
కేంద్ర హోం శాఖ పరిధిలోని ఢిల్లీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చెత్త పోలీసింగ్ అంటూ మండిపడింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంపై బీజేపీ, దాని అనుబంధ సంఘాలకు చెందిన కార్యకర్తలు చేసిన దాడికి పోలీసులే కారమణంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. పోలీసులై వైఫల్యం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడినట్టు తెలిపింది. 
 
"ది కాశ్మీర్ ఫైల్స్" సినిమాపై ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ యువమోర్ఛా గత నెల 30వ తేదీన సీఎం నివాసంపై దాడి జరిగింది. బారికేడ్లను తొలగించి విధ్వంసానికి పాల్పడింది. 
 
ఈ ఘటనపై ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విపిన్ సంఘి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ దాడి ఘటన పోలీసులు వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని వ్యాఖ్యానించింది. 
 
కేజ్రీవాల్ నివాసం వద్ద సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి బాధ్యులెవరో తేల్చి 2 వారాల్లో తమకు నివేదిక సమర్పించాలంటూ ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించి తదుపరి విచారణను వచ్చే నెల 17వ తేదీకి వాయిదావేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments