Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భర్తలేడు.. వేరొక వ్యక్తి ఇష్టమన్నాడు.. నో చెప్పడంతో సామూహిక అత్యాచారం..

భర్తలేడు.. వేరొక వ్యక్తి ఇష్టమన్నాడు.. నో చెప్పడంతో సామూహిక అత్యాచారం..
, గురువారం, 27 జనవరి 2022 (15:47 IST)
భర్త చనిపోవడంతో ఆమె తన కూతురితో ఒంటరి జీవనం గడుపుతోంది. అయితే ఆమె ఇంటి పక్కనే వున్న వ్యక్తి ఆమెను ఇష్టపడ్డాడు. కానీ అందుకు ఒప్పుకోలేదు. ఆ యువకుడు గత ఏడాది నవంబర్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు.
 
దీనిపై ఆగ్రహం చెందిన ఆ యువకుడి కుటుంబ సభ్యులు ఆ మహిళను ఇంట్లో నుంచి బయటకు లాగారు. ముగ్గురు బహిరంగంగా గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఈ దుర్ఘటన దేశ రాజధాని నగరం ఢిల్లీలో చోటుచేసుకుంది. విహార్ కస్తూర్బా నగర్‌లో గణతంత్ర దినోత్సవం రోజునే ఈ దారుణం జరిగింది.  
 
బాధితురాలి చెల్లెలి ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.  ఆ వీడియోను చూసిన ఢిల్లీ మహిళా కమిషన్ సీరియస్ అయింది. 
 
ఈ వీడియోలో సామూహిక అత్యాచారం తర్వాత బాధితురాలికి నిందితులు శిరోముండనం చేశారు.. చితకబాదారు.. మొహానికి నల్ల రంగు పూసి.. మెడలో చెప్పులదండ వేసి వీధులన్నీ తిప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైకాపా నేతలను వేటకొడవళ్లతో నరికేసిన బీజేపీ నేతలు