Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోధుమలంటే అలర్జీ.. రొట్టెలు తింటే తలనొప్పి... యువతి సూసైడ్

Webdunia
బుధవారం, 19 డిశెంబరు 2018 (14:58 IST)
ఉత్తర భారతదేశంలో ప్రధాన ఆహార ధాన్యం గోధుమలు. గోధుమ పిండితో చేసిన వంటకాలే ఇక్కడ ప్రధాన ఆధారం. అదే దక్షిణ భారతదేశంలో అయితే, వరి ధాన్యంతో చేసిన ఆహారం కీలకం. కానీ, ఉత్తరాదికి చెందిన ఓ యువతికి గోధుమలు చూస్తేనే అలర్జీని. వాటిని చూసి తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
హర్యానా రాష్ట్రంలోని జీంద్ ప్రాంతానికి చెందిన సురభి (25) అనే యువతికి ఇంకా పెళ్లి కాలేదు. ఈమెకు చిన్నప్పటి నుంచి గోధుమలంటే అలర్జీ. వాటిని చూస్తేనే తట్టుకోలేకపోయేది. పైగా, గోధుమలతో చేసిన ఏ ఆహారాన్నీ ఆమె ముట్టేది కాదు. 
 
బీటెక్ పూర్తి చేసి, ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసే ఆమెకు వైద్యం చేయించాలని తల్లిదండ్రులు ప్రయత్నించినా కుదర్లేదు. దీంతో ఆమె క్రమంగా తన బరువును కోల్పోయింది. 52 కిలోల బరువుండే ఆమె 32 కిలోల బరువుకు తగ్గిపోయింది. 
 
రొట్టెలు తింటే తలనొప్పి, కడుపునొప్పితో బాధపడుతుండే ఆమె, దాన్ని మానేసి, బియ్యం, పల్లీలపై ఆధారపడినా బరువులో మార్పులేదు. ఈ క్రమంలో తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఆమె తన చున్నీతో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments