Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటి శుభకార్యానికి బంధువులను పిలవలేదని కన్నబిడ్డను కాల్చేసిన తండ్రి...

Webdunia
మంగళవారం, 29 జనవరి 2019 (08:49 IST)
ఇంట్లో జరిగే శుభకార్యానికి బంధువులందరినీ పిలవలేదన్న కారణంతో కన్నబిడ్డను ఓ కసాయి తండ్రి తుపాకీతో కాల్చిపారేశాడు. హర్యానా రాష్ట్రంలోని భివానీలో జరిగిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
భివానీ జిల్లాలోని సుధీవాస్ గ్రామానికి చెందిన తారాచంద్ అనే వ్యక్తి ఇంట్లో ఓ శుభకార్యాన్ని నిర్వహించేందుకు తలపెట్టారు. ఇందుకోసం చుట్టుపక్కలవారితో పాటు బంధువులను కూడా ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నాడు. అయితే, బంధువులను పిలిచే  బాధ్యతలను తన కుమారుడు ధర్మేంద్రకు అప్పగించాడు. 
 
అతను కొంతమంది బంధువులను పిలిచి.. ఇంకొందరిని పిలవలేదు. ఈ విషయం తారాచంద్‌కు తెలిసి ఆగ్రహించి, వారిని కూడా పిలవాలని చెప్పాడు. కానీ, ధర్మేంద్ర వారిని పిలిచేందుకు ససేమిరా అన్నారు. వెంటనే ఆగ్రహోద్రుక్తుడైన తారాచంద్ తన తుపాకీ తీసి కుమారునిపై కాల్పులు జరిపాడు. 
 
ఫలితంగా అతను కుప్పకూలిపోవడంతో, వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతనిని పరిశీలించి, అప్పటికే మృతి చెందాడని తేల్చిచెప్పారు. దీంతో బంధువులు ధర్మేంద్ర మృతదేహాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. తారాచంద్‌తో పాటు.. మొత్తం 12 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని విచారిస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments