Webdunia - Bharat's app for daily news and videos

Install App

హర్యానాలో అంతుచిక్కని జ్వరం - 24 మంది చిన్నారుల మృతి

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (15:24 IST)
హర్యానా రాష్ట్రంలో అంతుచిక్కని జ్వరాలు ప్రజలను భయపెడుతున్నాయి. ఈ జ్వరాలకు చిన్నారులు అనేక మంది మృత్యువాతపడుతున్నారు. ఇప్పటికే ఈ రాష్ట్రంలోని పాల్వల్ జిల్లాలో అంతు చిక్కని జ్వరంతో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
 
ఈ అంతుచిక్కని జ్వరంతో హథిన్​ ప్రాంతంలో గడిచిన పది రోజుల్లో 24 మంది చిన్నారులు మరణించారు. చిల్లీ గ్రామంలో 11 మంది సహా మరో రెండు చోట్ల 13 మంది మృతిచెందారు. మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ జ్వరం బారిన పడినవారి సంఖ్యతో పాటు మృతులు పెరగడం వల్ల స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
 
జ్వరం బారినపడిన రెండు రోజులకే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తన చిన్నారి మరణించినట్లు బాధిత తల్లిదండ్రులు తెలిపారు. ప్లేట్​లెట్స్​ కౌంట్​ భారీగా తగ్గిపోయి.. తొమ్మిది నెలల పసికందు చనిపోయింది. అయితే ఆ శిశువు డెంగ్యూతో చనిపోయినట్లు వైద్యులు చెబుతున్నారు. ఇంత మంది పిల్లలు మరణించినప్పటికీ వైద్యాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kartik Aaryan- Sreeleela: కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమాయణం? డిన్నర్‌కు? (video)

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments