Webdunia - Bharat's app for daily news and videos

Install App

హర్యానాలో అంతుచిక్కని జ్వరం - 24 మంది చిన్నారుల మృతి

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (15:24 IST)
హర్యానా రాష్ట్రంలో అంతుచిక్కని జ్వరాలు ప్రజలను భయపెడుతున్నాయి. ఈ జ్వరాలకు చిన్నారులు అనేక మంది మృత్యువాతపడుతున్నారు. ఇప్పటికే ఈ రాష్ట్రంలోని పాల్వల్ జిల్లాలో అంతు చిక్కని జ్వరంతో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
 
ఈ అంతుచిక్కని జ్వరంతో హథిన్​ ప్రాంతంలో గడిచిన పది రోజుల్లో 24 మంది చిన్నారులు మరణించారు. చిల్లీ గ్రామంలో 11 మంది సహా మరో రెండు చోట్ల 13 మంది మృతిచెందారు. మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ జ్వరం బారిన పడినవారి సంఖ్యతో పాటు మృతులు పెరగడం వల్ల స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
 
జ్వరం బారినపడిన రెండు రోజులకే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తన చిన్నారి మరణించినట్లు బాధిత తల్లిదండ్రులు తెలిపారు. ప్లేట్​లెట్స్​ కౌంట్​ భారీగా తగ్గిపోయి.. తొమ్మిది నెలల పసికందు చనిపోయింది. అయితే ఆ శిశువు డెంగ్యూతో చనిపోయినట్లు వైద్యులు చెబుతున్నారు. ఇంత మంది పిల్లలు మరణించినప్పటికీ వైద్యాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments