Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

ఐవీఆర్
ఆదివారం, 16 ఫిబ్రవరి 2025 (18:36 IST)
పెళ్లి జరుగుతోందన్న ఆనందం ఆవిరైపోయింది. మంగళవాయిద్యాల మధ్య వధువును పెళ్లాడేందుకు గుర్రంపై ఎక్కి ఊరేగింపుగా వెళ్తున్న వరుడు గుండెపోటుతో దానిపైనే ఒరిగిపోయాడు. ఈ హఠత్పరిణామంతో పెళ్లి వేడుక విషాదంగా మారిపోయింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ జిల్లాలో 27 ఏళ్ల వరుడు గుండెపోటుతో కుప్పకూలి మరణించాడు. శుక్రవారం రాత్రి తన బరాత్‌లో గుర్రంపై కూర్చొని పెళ్లి మండపం వద్దకు ఊరేగింపుగా బయలుదేరాడు. అతను మొదట్లో ఇతర బరాతీలతో కలిసి నృత్యం చేసి ఆ తరువాత గుర్రంపై ఎక్కాడు.
 
కెమేరా ఫుటేజ్‌లో వరుడు గుర్రంపై కూర్చున్నప్పుడు అస్వస్థతకు గురై ఒరిగిపోతున్నట్లు కనబడ్డాడు. అతడిని పట్టుకునేందుకు పలువురు ప్రయత్నించారు. అంతలోనే అతడు విగతజీవిగా మారాడు. అతన్ని వెంటనే సమీపంలోని వైద్య సదుపాయానికి తరలించారు కానీ చాలా ఆలస్యం అయింది. నృత్యం చేసి అలసిపోయిన తర్వాత అతనికి గుండెపోటు వచ్చిందని వైద్యులు అనుమానిస్తున్నారు. ప్రదీప్ నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా మాజీ జిల్లా అధ్యక్షుడు. వరుడు మరణం గురించి విన్న వధువు మూర్ఛపోయిందని సమాచారం.
 
మధ్యప్రదేశ్‌లో ఇటీవలే ఇలాంటి సంఘటనలో తన కజిన్ సోదరి వివాహ కార్యక్రమంలో నృత్యం చేస్తూ 23 ఏళ్ల యువతి అకస్మాత్తుగా కుప్పకూలి మరణించింది. ఇండోర్ నగరానికి చెందిన పరిణితా జైన్ అనే మహిళ గుండెపోటుతో మరణించింది. హల్దీ వేడుక సందర్భంగా ఆమె నృత్యం చేస్తుండగా గుండెపోటుతో మరణించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments