Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక, చూడండి తొందరలోనే పెట్రోల్ లోన్ తీసుకోవాల్సి వస్తుంది..?

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (20:29 IST)
పెట్రో ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధర ఆల్ టైం హై రికార్డులను సృష్టించాయి. ఈ నేపథ్యంలో పెట్రో ధరలపై సెటైర్లు వేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్.
 
బుధవారం పార్లమెంట్‌లో శశిథరూర్ మాట్లాడుతూ.. ఇతర అంశాలతో పాటు.. బడ్జెట్‌ కేటాయింపులు, నిత్యావసరాల ధరలు, పెట్రో ధరలను ప్రస్తావించారు. రక్షణ, ఆరోగ్య రంగాలలో మోసపూరిత లెక్కలతో ప్రజలను మభ్యపెట్టి మోసగించే ప్రతిపాదనలు చేశారని కామెంట్ చేసిన శశిథరూర్.. లాల్ బహదూర్ శాస్త్రి 'జై జవాన్.. జై కిసాన్' అని నినదిస్తే.. తాజా బడ్జెట్ దానికి పూర్తి వ్యతిరేకంగా నా జవాన్.. నా కిసాన్ అని స్పష్టం చేస్తోందంటూ వ్యాఖ్యానించారు. 
 
ఇక, ఈ బడ్జెట్ మధ్య తరగతి వారిని పూర్తిగా విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. వారికి ఏం ఇచ్చారని అడిగితే పెట్రోల్ ధరలో పెరుగుదల ఇచ్చారని ఎద్దేవా చేశారు.. 2014 నుంచి పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం 894 శాతం పెంచేశారని తెలిపిన శశిథరూర్.. ఇక, చూడండి తొందరలోనే పెట్రోల్ కోసం బ్యాంకులో లోన్ తీసుకోవాల్సి వస్తుంది అంటూ సెటైర్లు వేశారు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments