ఇక, చూడండి తొందరలోనే పెట్రోల్ లోన్ తీసుకోవాల్సి వస్తుంది..?

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (20:29 IST)
పెట్రో ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధర ఆల్ టైం హై రికార్డులను సృష్టించాయి. ఈ నేపథ్యంలో పెట్రో ధరలపై సెటైర్లు వేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్.
 
బుధవారం పార్లమెంట్‌లో శశిథరూర్ మాట్లాడుతూ.. ఇతర అంశాలతో పాటు.. బడ్జెట్‌ కేటాయింపులు, నిత్యావసరాల ధరలు, పెట్రో ధరలను ప్రస్తావించారు. రక్షణ, ఆరోగ్య రంగాలలో మోసపూరిత లెక్కలతో ప్రజలను మభ్యపెట్టి మోసగించే ప్రతిపాదనలు చేశారని కామెంట్ చేసిన శశిథరూర్.. లాల్ బహదూర్ శాస్త్రి 'జై జవాన్.. జై కిసాన్' అని నినదిస్తే.. తాజా బడ్జెట్ దానికి పూర్తి వ్యతిరేకంగా నా జవాన్.. నా కిసాన్ అని స్పష్టం చేస్తోందంటూ వ్యాఖ్యానించారు. 
 
ఇక, ఈ బడ్జెట్ మధ్య తరగతి వారిని పూర్తిగా విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. వారికి ఏం ఇచ్చారని అడిగితే పెట్రోల్ ధరలో పెరుగుదల ఇచ్చారని ఎద్దేవా చేశారు.. 2014 నుంచి పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం 894 శాతం పెంచేశారని తెలిపిన శశిథరూర్.. ఇక, చూడండి తొందరలోనే పెట్రోల్ కోసం బ్యాంకులో లోన్ తీసుకోవాల్సి వస్తుంది అంటూ సెటైర్లు వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments