Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్య తీర్పు : ఈ క్రెడిట్ వారిద్దరిదే : గోవిందాచార్య

Webdunia
శనివారం, 9 నవంబరు 2019 (16:49 IST)
అయోధ్యపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించడాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్త, రామ జన్మభూమి రథయాత్రలో కీలక పాత్రధారి కేఎన్‌ గోవిందాచార్య స్వాగతించారు. పైగా, ఈ తరహా తీర్పు రావడానికి ప్రధాన కారణం వీహెచ్‌పీ నేత అశోక్ సింఘాల్, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీలదే కృషి అని చెప్పుకొచ్చారు. 
 
ఈ తీర్పుపై గోవిందాచార్య స్పందిస్తూ, అయోధ్య కేసులో తీర్పు తమకు అనుకూలంగా రావడానికి విశ్వ హిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) నేత అశోక్‌ సింఘాల్‌, ఎల్‌కే అద్వానీ చేసిన కృషే కారణమన్నారు. 
 
'సుప్రీంకోర్టు తుది తీర్పు చాలా సంతోషం కలిగించింది. ఇక మూడు నెలల్లో రామమందిరం నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాలి' అని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలంతా సంయమనంతో మెలగాలని, మత సామరస్యం పాటించాలని కోరారు. 
 
ఈ విజయానికి ప్రధాన కారణం ఎవరు అనుకుంటున్నారని ప్రశ్నించగా.. 'ఆలయ నిర్మాణం కోసం లక్షలాది మంది త్యాగాలు చేశారు. చాలా మంది అనేక రకాలుగా రామ జన్మభూమి ఉద్యమంలో తమ పాత్ర పోషించారు. కీలక​ భూమిక​ మాత్రం అశోక్‌ సింఘాల్‌, ఎల్‌కే అద్వానీదే' అని సమాధానం ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

తర్వాతి కథనం
Show comments