Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈదురు గాలులకు కదిలిన ఇంజిన్ లేని గూడ్సు రైలు.. ఆరుగురి మృతి

Webdunia
గురువారం, 8 జూన్ 2023 (09:19 IST)
ఒడిశా రాష్ట్రంలో మరో విషాదం ఘటన జరిగింది. వానొస్తుందని ఇంజన్ లేని గూడ్సు రైలు కిందకు వెళ్లిన కూలీల్లో కొందరు మృత్యువాతపడ్డారు. ఈదురు గాలుల ధాటికి పట్టాలపై ఆగివున్న గూడ్సు రైలు ముందుకు కదిలింది. దీంతో ఆ రైలు కింద కూర్చొనివున్న కార్మికుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన ఒడిశా రాష్ట్రంలోని ఝాజ్పూర్ రోడ్డు రైల్వే స్టేషన్‌లో బుధవారం ఈ ఘటన జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఝాజ్పూర్ రోడ్డు రైల్వేస్టేషన్‌లో సేఫ్టీ ట్రాక్‌పై కొద్దిరోజులుగా ఇంజన్ లేని ఖాళీ గూడ్స్ వ్యాగన్లు నిలిపి ఉంచారు. రైల్వే పనుల కోసం బుధవారం 8 మంది కార్మికులు అక్కడికి వచ్చారు. అయితే, వర్షంతో పాటు బలమైన గాలులు రావడంతో వారంతా నిలిపి ఉంచిన గూడ్స్ వ్యాగన్ల కింద తలదాచుకున్నారు. 
 
ఆ సమయంలో ఈదురు గాలులు మరింత బలంగా వీయడంతో గూడ్స్ వ్యాగన్లు ముందుకు కదిలాయి. వాటి చక్రాల కింద ఆరుగురు ప్రాణాలు విడిచారు. దీంతో కార్మికుల నివాసాల్లో విషాదం నెలకొంది. స్థానిక రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments