Webdunia - Bharat's app for daily news and videos

Install App

చనిపోయాడనీ అంత్యక్రియలు పూర్తి చేశారు.. మూడు నెలల తర్వాత ప్రత్యక్షమయ్యారు...

Webdunia
గురువారం, 4 జనవరి 2024 (10:37 IST)
గోవా రాష్ట్రంలో ఒక ఆశ్చర్యకరమైన ఘటన ఒకటి వెలుగు చూసింది. ఓ వ్యక్తి చనిపోయాడని భావించి అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. కానీ, చనిపోయాడని భావించిన వ్యక్తి మూడు నెలల తర్వాత తిరిగి ఇంటికి రావడంతో ఆయన కుటుంబ సభ్యులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గోవా రాజధాని పనాజీ సమీపంలోని గ్రామంలో నివసించే మార్కోస్‌ మిలాగ్రేస్‌ (59) అనే వ్యక్తి గత 2023లో కనిపించకుండా పోయాడు. దీంతో కుటుంబ సభ్యులు అదే ఏడాది అక్టోబరులో పోలీసులను ఆశ్రయించారు. అదే నెల 7న పనాజీలో పోలీసులకు ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. అది మిలాగ్రేస్‌దేనని కుటుంబ సభ్యులు నిర్ధరించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించగా.. అంత్యక్రియలు నిర్వహించారు. 
 
ఇది జరిగిన రెండు నెలల తర్వాత గోవా పోలీసులకు ముంబై నుంచి ఫోన్‌ వచ్చింది. ఓ వ్యక్తి తనను తాను మిలాగ్రేస్‌గా చెప్పుకొంటున్నట్లు సమాచారం అందించారు. దీంతో అతన్ని గోవా తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులను పిలిపించగా.. వారు మిలాగ్రేస్‌ను చూసి షాక్‌కు గురయ్యారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా ఆయన ముంబై వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అయితే.. మిలాగ్రెస్ కుటుంబానికి ఎవరి మృతదేహాన్ని అప్పగించారనేది తేలాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

ఫస్ట్ టైమ్ హరుడు తో మాస్ చిత్రం చేశా : హీరో వెంకట్

నేను గ్యాప్ తీసుకుంది దాని కోసమే : దర్శకుడు శ్రీను వైట్ల

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో తీశా : ఖడ్గం రీ రిలీజ్ సందర్భంగా కృష్ణవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments