Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ. 50వేలకు బాలికను అమ్మేసిన తల్లిదండ్రులు.. ఎక్కడ?

Webdunia
శనివారం, 13 మార్చి 2021 (15:34 IST)
మంచి హోదాలో ఉన్న యువకుడితో పెండ్లి చేయిస్తామని నమ్మబలికి బాలికను రూ. 50,000లకు ఓ దంపతులు విక్రయించిన దారుణ ఘటన యూపీలోని బదౌన్‌ జిల్లాలో వెలుగుచూసింది. పెళ్లి పేరుతో షహజన్‌పూర్‌ జిల్లా నుంచి తీసుకొచ్చిన నిందితులు బదౌన్‌లోని ఓ వ్యక్తికి అమ్మారు. 
 
ఈ విషయం పోలీసులకు తెలియడంతో బాలికను కొనుగోలు చేసిన వ్యక్తి సహా దంపతులను అరెస్ట్‌ చేశారు. జిల్లాలోని గదియ హర్దోపట్టి గ్రామానికి చెందిన రాజ్‌వీర్‌ బాలికను రూ 50,000కు కొనుగోలు చేసినట్టు సమాచారం.
 
మంజు దేవి, కృష్ణపాల్‌ దంపతులు బాలికకు పెండ్లి చేసి మంచి కుటుంబంలోకి పంపిస్తామని మహిళను నమ్మబలికి ఆమె కుమార్తెను బదౌన్‌ జిల్లాకు తీసుకువచ్చి రాజ్‌వీర్‌కు అమ్మారని పోలీసులు తెలిపారు. మంజు బాధితురాలి గ్రామానికి చెందిన వ్యక్తే కావడం గమనార్హం. 
 
రాజ్‌వీర్‌ తీరు నచ్చని బాధితురాలు నిందితులు తనను ఆయనకు విక్రయించారని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం బాలికను కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments