Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీడి మామిడి తోటలో యువతి చెట్టుకు వేలాడుతూ..?

Webdunia
శనివారం, 13 మార్చి 2021 (17:36 IST)
జీడి మామిడి తోటలో ఓ యువతి మృతదేహం ఒడిశాలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. జీడి మామిడి చెట్టు వద్ద రెండు కుక్కలు అరుస్తుండటంతో కొందరు వ్యక్తులు ఆ చెట్టు వద్ద ఏముందా అని తీక్షణంగా చూస్తే వారికి షాకింగ్ దృశ్యం కనిపించింది. ఆ మామిడి చెట్టుపై ఓ యువతి కూర్చుని ఉన్నట్టుగా ఉంది. పరిశీలనగా చూస్తే వారికి అప్పుడు తెలిసింది. ఆమె చనిపోయి ఉందని. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు పరిశిలించారు. 
 
ఒడిశా రాష్ట్రంలోని నవరంగపూర్ జిల్లాలోని డాబుగాం సమితి, ఘోడాఖంటి గ్రామ పంచాయతీలో మఝిగుడ అనే ఓ గ్రామం ఉంది. ఆ ఊరి చివర ఓ జీడిమామిడి తోట ఉంది. ఆ తోటలో శుక్రవారం ఓ యువతి మృతదేహం బయటపడింది. 
 
చెట్టుపై కూర్చున్నట్టుగా ఆ యువతి మృతదేహం ఉండటంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఉరి వేసుకున్నట్టుగా లేకుండా, కూర్చోబెట్టిన స్థితిలో ఉండటంతో, ఆమెను ఎవరో చంపి, ఇక్కడ పడేసి ఉంటారన్న వార్తలు వినిపిస్తున్నాయి. యువతి అదే ఊరికి చెందిన లలిఫా హరిజన్ అనే 22 ఏళ్ల యువతిగా తేల్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments