Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా టీకా వేసుకుంటే.. ఆస్తి పన్నులో బంపర్ ఆఫర్

Webdunia
ఆదివారం, 11 ఏప్రియల్ 2021 (08:45 IST)
కరోనా వైరస్ వేయించుకుంటే ఆస్తి పన్ను చెల్లింపులు రిబేట్ ఇస్తామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులో విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనికి కారణం కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి శరవేగంగా సాగడమే. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ మహమ్మారిని అడ్డుకునేందుకు ప్రభుత్వం టీకాలు వేస్తోంది. 
 
చాలా మంది జనం టీకా వేసుకునేందుకు ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహించేందుకు ఉత్తర ఢిల్లీ మేయర్‌ జై ప్రకాశ్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. కొవిడ్‌ టీకా వేసుకుంటే ఆస్తిపన్నులో రీబేటు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
 
రాయితీ కోసం రెసిడెన్షియల్‌ హౌస్‌ యజమాని, అర్హత గల కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ మేరకు కార్పొరేషన్‌ ఆమోదం కోసం సర్క్యులర్‌ జారీ చేసినట్లు తెలిపారు. 
 
ఈ మేరకు నివాస గృహాల యజమానులు, పన్ను చెల్లింపుదారులకు ఆస్తిపన్నులో అదనంగా 5శాతం రిబేటు ఇస్తామన్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ కాపీలు అందజేయాలని తెలిపారు. సర్క్యులర్‌ తక్షణం అమలులోకి వస్తుందని, జూన్‌ 30వ తేదీ వరకు మాత్రమే అవకాశం అందుబాటులో ఉంటుందని చెప్పారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments