Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిపిన్ రావత్‌కు దేశ ప్రజల ఘన నివాళి.. భరత భూమి పుత్రుడంటూ నినాదాలు

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (15:55 IST)
తమిళనాడు రాష్ట్రంలో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో అశువులుబాసిన త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్‌కు దేశ ప్రజలు ఘన నివాళులు అర్పించారు. భరతభూమి పుత్రుడు రావత్ అమర్ రహే అంటూ నినాదాలతో హోరెత్తించారు. 
 
బుధవారం మధ్యాహ్నం నీలగిరి జిల్లా కాట్టేరి అటవీ కొండ ప్రాంతంలో రక్షణ శాఖకు చెందిన హెలికాఫ్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికా రావత్, మరో 11 మంది రక్షణ సిబ్బంది మృత్యువాతపడ్డారు. 
 
ఇందులో బిపిన్ రావత్ దంపతులు, లాన్స్ నాయక్ లిద్దర్ మృతదేహాలను మాత్రమే గుర్తించారు. మగిలిన వారి మృతదేహాలు గుర్తించలేనంతగా కాలిపోయాయి. దీంతో ఈ మృతదేహాలకు, వారి కుటుంబ సభ్యులు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నారు.
 
ఇదిలావుంటే, బిపిన్ రావత్ దంపతుల అంతిమయాత్రం శుక్రవారం మధ్యాహ్నం కామరాజర్ మార్గ్‌లోని ఆయన నివాసం నుంచి ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలో ఉన్న బ్రార్ స్క్వేర్‌లోని శ్మశానవాటిక వరకు సాగనుంది. ఈ శ్మశానవాటికలో వారిద్దరి అంత్యక్రియలు నిర్వహిస్తారు. 
 
ఈ వీరనాయకుడికి అంతమ వీడ్కోలు పలికేందుకు జనం భారీగా తరలివచ్చారు. పార్థివదేహంతో వెళుతున్న వాహనంపై పూల వర్షం కురిపించారు. కొందరు యువత జాతీయ జెండాను చేతుల్లో పట్టుకుని ఆ వాహనం వెంట నడిచారు. భరతభూమి పుత్రుడు అమరరహే, ఇండియన్ ఆర్మీ జిందాబాద్, వందేమాతరం అంటూ నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. చేశారు. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments