Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగిసిన వర్క్ ఫ్రమ్ హోం : నేటి నుంచి కార్యాలయాలకు...

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (07:19 IST)
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇంతకాలం కొనసాగుతూ వచ్చిన వర్క్ ఫ్రమ్ హోం సౌలభ్యం ఆదివారంతో ముగిసింది. సోమవారం నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా కార్యాలయాలకు వెళ్లి విధులు నిర్వహించాల్సివుంది. సోమవారం నుంచి అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు విధిగా కార్యాలయ విధులకు హాజరుకావాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. 
 
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గతంలో అన్ని శాఖలకు చెందిన ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోం ప్రకటించింది. కానీ, ప్రస్తుతం ఈ వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గింది. అదేసమయంలో రోజువారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టాయి.
 
దీంతో వర్క్ ఫ్రమ్ హోం వెసులుబాటును రద్దు చేసి, అన్ని శాఖల ఉద్యోగులు విధిగా కార్యాలయాలకు రావాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఈ కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments