స్వతంత్ర భారతావనిలో తొలి తీవ్రవాది హిందువే : కమల్ హాసన్

Webdunia
మంగళవారం, 14 మే 2019 (12:34 IST)
సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వతంత్ర భారతదేశంలో తొలి తీవ్రవాది హిందువేనని వ్యాఖ్యానించారు. మహాత్మా గాంధీని హత్యచేసిన నాథూరామ్‌ గాడ్సేను తొలి తీవ్రవాదిగా ఆయన అభివర్ణించారు. 
 
తమిళనాడు రాష్ట్రంలో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఈనెల 18వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఇందులోభాగంగా ఆయన కరూరు జిల్లా అరవకురిచ్చిలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశంలో మొదటి తీవ్రవాది ఓ హిందువని, అతడే మహాత్మాగాంధీని హత్యచేసిన నాథూరామ్‌గాడ్సే అని వ్యాఖ్యానించారు. 
 
ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతం కాబట్టి తాను ఈ మాట చెప్పడం లేదన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం ముందు నిలబడ్డాను కాబట్టే ఈ విషయం గురించి మాట్లాడుతున్నట్టు చెప్పుకొచ్చారు. 
 
స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి తీవ్రవాది ఓ హిందువు. అతడే నాథూరామ్ గాడ్సే. అక్కడి నుంచే తీవ్రవాదం మొదలైంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను గాంధీజీకి మనుమడి వంటివాడినని, ఆయన హత్యపై నెలకొన్న ప్రశ్నలకు సమాధానాలు కోరేందుకే ఇక్కడికి వచ్చానన్నారు. నిజమైన భారతీయులు త్రివర్ణ పతాకంలోని రంగులను, వాటి వెనుక ఉన్న విశ్వాసాలను చెక్కుచెదురకుండా కాపాడుకుంటారని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments