Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మసూద్ అజర్ అంతర్జాతీయ ఉగ్రవాది: ఐరాస, అలాగేనన్న చైనా

మసూద్ అజర్ అంతర్జాతీయ ఉగ్రవాది: ఐరాస, అలాగేనన్న చైనా
, బుధవారం, 1 మే 2019 (20:02 IST)
ఉగ్రవాద కార్యకలాపాలతో నిత్యం తలమునకలయ్యే జైషె మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజర్ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి ఆమోదించింది. దీనితో ఎన్నో ఏళ్లుగా భారతదేశం చేస్తున్న పోరాటానికి ఫలితం దక్కింది.
 
పుల్వామా దాడి అనంతరం భారతదేశం అంతర్జాతీయ సమాజంపై ఒత్తిడి తెచ్చింది. దాడికి సంబంధించిన పూర్తి ఆధారాలను సమితి ముందు ఉంచడంతో ఈ మేరకు చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఐతే అంతకుముందు వరకూ మసూద్ అజర్ విషయంలో మోకాలడ్డిన చైనా కూడా గత్యంతరం లేని పరిస్థితిలో సభ్యదేశాల నిర్ణయానికి మద్దతు తెలిపింది. 
 
మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడానికి సభ్యదేశాలలో మెజారిటీ ఆమోదం తెలిపినప్పటికీ చైనా నాలుగుసార్లు అడ్డుకుంది. కానీ పుల్వామా దాడి తర్వాత ఇక చైనా చేయి దాటిపోయింది. దీనితో మసూద్ అజర్ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్రేక్‌ఫాస్ట్‌కో డ్రెస్సు, లంచ్‌కి మరో డ్రస్సు, మధ్యాహ్నం ఇంకో డ్రెస్సు.