ప్రధాన ప్రత్యర్థులు: నిమ్మల కిష్టప్ప (తెదేపా) వర్సెస్ గోరంట్ల మాధవ్ (వైసీపి)
	 
 
									
			
			 
 			
 
 			
					
			        							
								
																	
	ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. గత 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి తెదేపాకు చెందిన నిమ్మల కిష్టప్ప విజయం సాధించారు. ఈసారి 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గోరంట్ల మాధవ్ బరిలోకి దిగారు. 
 
									
										
								
																	
	 
	గత ఎన్నికల్లో తెదేపాకు చెందిన నిమ్మల కిష్టప్పకు 604,291 ఓట్లు పోలయ్యాయి. అలాగే వైకాపా తరపున దుద్దుకుంట శ్రీథర్ రెడ్డికి 506,966 ఓట్లు వచ్చాయి.
 
									
											
							                     
							
							
			        							
								
																	
	 
	ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 లోక్ సభ స్థానాలు వున్న సంగతి తెలిసిందే. ఈసారి హేమాహేమీలు పోటీ పడుతున్నారు. తెదేపా నుంచి అశోక్ గజపతిరాజు, కేశినేని నాని, గల్లా జయదేవ్, రాయపాటి సాంబశివరావు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, సి. ఆదినారాయణ రెడ్డి, పనబాక లక్ష్మి, శివప్రసాద్ తదితరులు వున్నారు. ఇక వైసీపీ నుంచి పి. వరప్రసాద్(పీవీపి), మాగుంట శ్రీనివాస రెడ్డి తదితరులు వున్నారు. జనసేన పార్టీ నుంచి వివి లక్ష్మీనారాయణ(సీబీఐ మాజీ జెడి), నాగబాబు(పవన్ కల్యాణ్ సోదరుడు) తదితరులు వున్నారు. మే 23న ఫలితాలు మీకోసం ఇక్కడే అందిస్తాం.