Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో భారీ పేలుడు - నలుగురు మృతి! కారణం ఏంటో?

ఠాగూర్
ఆదివారం, 23 మార్చి 2025 (10:48 IST)
హర్యానా రాష్ట్రంలోని బహదూర్‌గఢ్‌లో శనివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో అదే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడుకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. 
 
సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. గ్యాస్ సిలిండర్ కారణంగానే ఈ పేలుడు సంభవించివుండొచ్చని భావిస్తున్నారు. అయితే, ఈ పేలుడు పడక గదిలో జరిగిందని అంటున్నారు. 
 
కాగా, ఈ పేలుడుపై డీసీపీ మయాంక్ మిశ్రా స్పందిస్తూ, ఇది సిలిండర్ పేలుడు కాదు. పేలుడు బెడ్ రూమ్‌లో జరిగింది. దీని ప్రభావం మొత్తం ఇంటిపై పడింది. నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు అని వెల్లడించారు. 
 
ఎయిర్ కండిషనర్‌ కంప్రెషర్‌ కారణంగా పేలుడు జరిగివుంటుందని పోలీసులు భావిస్తున్నారు. పేలుడు కారణంగా ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అగ్నిమాపకదళ సిబ్బందికి సమాచారం అందించారు. వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఆ తర్వాత ఇంట్లో నుంచి నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments