Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో భారీ పేలుడు - నలుగురు మృతి! కారణం ఏంటో?

ఠాగూర్
ఆదివారం, 23 మార్చి 2025 (10:48 IST)
హర్యానా రాష్ట్రంలోని బహదూర్‌గఢ్‌లో శనివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో అదే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడుకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. 
 
సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. గ్యాస్ సిలిండర్ కారణంగానే ఈ పేలుడు సంభవించివుండొచ్చని భావిస్తున్నారు. అయితే, ఈ పేలుడు పడక గదిలో జరిగిందని అంటున్నారు. 
 
కాగా, ఈ పేలుడుపై డీసీపీ మయాంక్ మిశ్రా స్పందిస్తూ, ఇది సిలిండర్ పేలుడు కాదు. పేలుడు బెడ్ రూమ్‌లో జరిగింది. దీని ప్రభావం మొత్తం ఇంటిపై పడింది. నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు అని వెల్లడించారు. 
 
ఎయిర్ కండిషనర్‌ కంప్రెషర్‌ కారణంగా పేలుడు జరిగివుంటుందని పోలీసులు భావిస్తున్నారు. పేలుడు కారణంగా ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అగ్నిమాపకదళ సిబ్బందికి సమాచారం అందించారు. వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఆ తర్వాత ఇంట్లో నుంచి నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments