ఇంట్లో భారీ పేలుడు - నలుగురు మృతి! కారణం ఏంటో?

ఠాగూర్
ఆదివారం, 23 మార్చి 2025 (10:48 IST)
హర్యానా రాష్ట్రంలోని బహదూర్‌గఢ్‌లో శనివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో అదే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడుకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. 
 
సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. గ్యాస్ సిలిండర్ కారణంగానే ఈ పేలుడు సంభవించివుండొచ్చని భావిస్తున్నారు. అయితే, ఈ పేలుడు పడక గదిలో జరిగిందని అంటున్నారు. 
 
కాగా, ఈ పేలుడుపై డీసీపీ మయాంక్ మిశ్రా స్పందిస్తూ, ఇది సిలిండర్ పేలుడు కాదు. పేలుడు బెడ్ రూమ్‌లో జరిగింది. దీని ప్రభావం మొత్తం ఇంటిపై పడింది. నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు అని వెల్లడించారు. 
 
ఎయిర్ కండిషనర్‌ కంప్రెషర్‌ కారణంగా పేలుడు జరిగివుంటుందని పోలీసులు భావిస్తున్నారు. పేలుడు కారణంగా ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అగ్నిమాపకదళ సిబ్బందికి సమాచారం అందించారు. వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఆ తర్వాత ఇంట్లో నుంచి నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments