ఆలయ ఉత్సవాల్లో అపశృతి - కూలిన క్రేన్.. నలుగురి మృతి

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (12:48 IST)
తమిళనాడు రాష్ట్రంలోని రాణిపేట జిల్లాలో ఆదివారం రాత్రి ఓ విషాదకర ఘటన జరిగింది. ఈ జిల్లాలోని ద్రౌపది అమ్మన్ ఆలయ వేడుకల్లో జరిగిన ఈ అపశృతిలో నలుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఆలయ విగ్రహాలకు భారీ పూలమాలలను వేస్తుండగా, ఒక్కసారిగా క్రేన్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు భక్తులు చనిపోయారు. మరో కొందరు గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి క్రేన్ ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
 
రాణిపేట జిల్లాలోని ద్రౌపది అమ్మన్ ఆలయంలో ప్రతి యేటా వార్షిక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. ఇందులోభాగంగా, ఆదివారం రాత్రి ఆలయ ఉత్సవ మూర్తుల ఊరేగింపు జరిగింది. ఈ విగ్రహాలకు భారీ క్రేన్‌పై ఉంచి పూజారులు, ఆలయ సిబ్బందితో పాటు మొత్తం ఎనిమిది మంది క్రేన్‌పైకెక్కారు. వీరు ఉత్సవ మూర్తులకు పూలమాలలు వేస్తుండగా, ఒక్కసారిగా క్రేన్ కూలిపోయింది. 
 
క్రేన్ బాగా ఎత్తుకు తీసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారని రాణిపేట జిల్లా ఎస్పీ దీపా సత్యన్ వెల్లడించారు. నిజానికి ఆలయ వేడుకల్లో క్రేన్‌ను ఉపయోగించేందుకు ముందస్తు అనుమతి తీసుకోలేదని అందుకే క్రేన్ ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్టు చెప్పారు. ఈ ప్రమాద ఘటనపై ప్రాథమిక విచారణ జరుపుతున్నట్టు ఎస్పీ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తున్న ఇట్లు మీ ఎదవ

తల్లి తో అవార్డ్ అందుకున్న మధుర క్షణాల్లో సాయి దుర్గ తేజ్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments