Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నెల్లూరులో అర్థరాత్రి రైలు ఢీకొని ముగ్గురు దుర్మరణం

Advertiesment
train
, ఆదివారం, 22 జనవరి 2023 (09:57 IST)
నెల్లూరు జిల్లా కేంద్రంలోని ఆత్మకూరు బస్టాండు వద్ద ఉన్న రైల్వే బ్రిడ్జిపై రైలు ఢీకొని ఓ మహిళతో పాటు ఇద్దరు పురుషులు ప్రాణాలు కోల్పోయారు. వారివద్ద ఉన్న సంచల్లో తితిదే లాకర్ అలాట్మెంట్ టికెట్లు ఉన్నాయి. గూండురు నుంచి విజయవాడ వైపు వెళుతున్న నర్సాపూర్ ఎక్స్‌‍ప్రెస్ రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతి చెందినవారి వయసు 45 నుంచి 50 యేళ్ళ మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో పురుషులు ఇద్దరూ పట్టాలపైనే ప్రాణాలు కోల్పోగా, మహిళ మాత్రం బ్రిడ్జిపై నుంచి కిందపడి చనిపోయింది. 
 
అయితే, పట్టాలపై ఉన్న మహిళను రక్షించే క్రమంలో పురుషులు కూడా ప్రమాదంబారినపడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందినవారా? లేదంటే ఇంకెవరైనానా? అనే విషయాలు తెలియాల్సివుంది. ప్రమాద సమయంలో వారి చేతుల్లో ఉన్న సంచులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో తిరుమల తిరుపతి దేవస్థానం లాకర్ అలాట్మెంట్ టిక్కెట్లు ఉన్నాయి. వాటితోపాటు సంచిలో ఉన్న ఫోన్ నంబరుకు పోలీసులు ఫోన్ చేస్తుంటే ఏ ఒక్కరూ స్పందించడం లేదు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజన చేయడం వల్లే జీతాలు ఇవ్వలేకపోతున్నాం..