Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంధకారంలో పాకిస్థాన్.. కారణం ఏంటో తెలుసా?

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (12:21 IST)
పాకిస్థాన్‌లో గాఢాంధకారం నెలకొంది. ప్రధాన పవర్ గ్రిడ్ ఫెయిల్యూల్ కావడంతో ఈ పరిస్థితి నెలకొందని ఆ దేశ విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ కారణంగా పాక్ రాజధాని ఇస్లామాబాద్, లాహోర్, కరాచీ నగరాలు కూడా పూర్తిగా అంధకారంలో నెలకొన్నాయి. అలాగే బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని 22 జిల్లాల్లో అంధకారం నెలకొంది. నేషనల్ పవర్ గ్రిడ్ నుంచి ఫ్రీక్వెన్సీ పడిపోవడంతో పవర్ గ్రిడ్ బ్రేక్ డౌన్ అయిందని చెప్పారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ ట్వీట్ చేసింది. 
 
దేశంలోని పలు విద్యుత్ పంపిణీ సంస్థలు అంతకుముందు విద్యుత్ సరఫరా నిలిచిపోయిన విషయాన్ని ధృవీకరించాయని పాకిస్థాన్ అధికారిక టీవీ చానెల్ జియో టీవీ ఓ కథనాన్ని ప్రసారం చేసింది. గుడ్డు, క్వెట్టా నగరాల మధ్య విద్యుత్ సరఫరా చేసే రెండు లైన్లు ట్రిప్ అయ్యాయని దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని క్వెట్టా ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ వెల్లడించింది.
 
బలూచిస్థాన్‌లోని 22 జిల్లాలకు విద్యుత్ సరఫరా ఆగిపోయిందని, లాహోర్, కరాచీలోని పలు ప్రాంతాల్లోనూ చీకట్లు అలుముకున్నాయని అధికారులు వెల్లడించాయి. ఇస్లామాబాద్‌లోని 117 పవర్ గ్రిడ్ స్టేషన్లతో పాటు పెషావర్‌లోనూ విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments