అంధకారంలో పాకిస్థాన్.. కారణం ఏంటో తెలుసా?

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (12:21 IST)
పాకిస్థాన్‌లో గాఢాంధకారం నెలకొంది. ప్రధాన పవర్ గ్రిడ్ ఫెయిల్యూల్ కావడంతో ఈ పరిస్థితి నెలకొందని ఆ దేశ విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ కారణంగా పాక్ రాజధాని ఇస్లామాబాద్, లాహోర్, కరాచీ నగరాలు కూడా పూర్తిగా అంధకారంలో నెలకొన్నాయి. అలాగే బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని 22 జిల్లాల్లో అంధకారం నెలకొంది. నేషనల్ పవర్ గ్రిడ్ నుంచి ఫ్రీక్వెన్సీ పడిపోవడంతో పవర్ గ్రిడ్ బ్రేక్ డౌన్ అయిందని చెప్పారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ ట్వీట్ చేసింది. 
 
దేశంలోని పలు విద్యుత్ పంపిణీ సంస్థలు అంతకుముందు విద్యుత్ సరఫరా నిలిచిపోయిన విషయాన్ని ధృవీకరించాయని పాకిస్థాన్ అధికారిక టీవీ చానెల్ జియో టీవీ ఓ కథనాన్ని ప్రసారం చేసింది. గుడ్డు, క్వెట్టా నగరాల మధ్య విద్యుత్ సరఫరా చేసే రెండు లైన్లు ట్రిప్ అయ్యాయని దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని క్వెట్టా ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ వెల్లడించింది.
 
బలూచిస్థాన్‌లోని 22 జిల్లాలకు విద్యుత్ సరఫరా ఆగిపోయిందని, లాహోర్, కరాచీలోని పలు ప్రాంతాల్లోనూ చీకట్లు అలుముకున్నాయని అధికారులు వెల్లడించాయి. ఇస్లామాబాద్‌లోని 117 పవర్ గ్రిడ్ స్టేషన్లతో పాటు పెషావర్‌లోనూ విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments