Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజల దృష్టి మళ్లించేందుకే తెరపైకి కుట్ర కోణం : సీబీఐ మాజీ డైరెక్టర్

Webdunia
మంగళవారం, 6 జూన్ 2023 (10:54 IST)
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఘోర ప్రమాదంపై దేశ ప్రజల దృష్టిని మళ్లించేందుకు, కేంద్ర ప్రభుత్వం, రైల్వే అధికారులు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కుట్ర కోణాన్ని తెరపైకి తెచ్చారని సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వర రావు ఆరోపించారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో కుట్రకోణం ఉందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో కుట్ర కోణాన్ని తెరపైకి తెచ్చారని ఆయన అభిప్రాయపడ్డారు. ఎక్కడ పెద్ద ప్రమాదం జరిగినా రైల్వే అధికారులకు ఈ అలవాటు పరిపాటిగా మారిందన్నారు. 
 
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటనలో కుట్ర కోణాన్ని తెరపైకి తెచ్చారు. ఐటీ సెల్‌‍లోని పెయిడ్ ఆర్టిస్టులు దానికి అన్ని రకాలుగా అబద్దాలు గుప్పించి, మతపరమైన మసాలా జోడించి విస్తృతమైన ప్రచారం చేస్తున్నారు అంటూ సోమవారం తన ట్విట్టర్ ఖాతాలో విమర్శలు గుప్పించారు. 
 
గతంలో తాను రెండు రైల్వే పోలీసు జిల్లాలకు ఎస్పీగా, ఒడిశా రైల్వే పోలీస్ అదనపు డీజీపీగా పని చేసిన అనుభవంతో చెబుతున్నాను. ఎపుడు రైలు ప్రమాదం జరిగినా ప్రజల దృష్టిని మళ్లించేందుకు, వారి లోపాల్ని, అసమర్థతను, చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు కుట్ర జరిగిందని చెప్పడం రైల్వే అధికారులకు అలవాటైన ఎత్తుగడ. దర్యాప్తు నివేదిక వచ్చేసరికి ప్రజలు ఈ ప్రమాద విషయాన్ని మరిచిపోతారు" అని అన్నారు. ఈ రైలు దుర్ఘటనకు మతాన్ని జోడించి చేస్తున్న ప్రచారమనే మాయలో పడొద్దని ప్రజలను ఆయన కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments