Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ 'పద్మ' పురస్కారం నాకొద్దు : బుద్ధదేవ్ భట్టాచార్య

Webdunia
బుధవారం, 26 జనవరి 2022 (10:57 IST)
భారత గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని మంగళవారం రాత్రి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. వీరిరో వెస్ట్ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య ఒకరు. అయితే, ఈయన ఈ పురస్కారాన్ని తిరస్కరించారు. ఈ అవార్డు గురించి తనను ఎవరూ సంప్రదించలేదని, ఎవరూ చెప్పలేదని చెప్పారు. ముందుగా సంప్రదించివుంటే ఖచ్చితంగా ఈ పురస్కారం వద్దని చెప్పేవాడనని తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో సంక్షిప్త ప్రకటన విడుదల చేశారు. 
 
అయితే, కేంద్ర ప్రభుత్వం వాదన మరోలావుంది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి మంగళవారం ఉదయం ఈ అవార్డు విషయమై భట్టాచార్య భార్యతో మాట్లాడినట్టు తెలిపింది. ఇందుకు ఆమె అంగీకరించారని, పౌర పురస్కారానికి ఎంపిక చేసినందుకు హోంమంత్రిత్వ శాఖకు ధన్యవాదాలు కూడా తెలిపారని హోంశాఖ వివరణ ఇచ్చింది. 
 
కాగా, 77 యేళ్ళ బుద్ధదేవ్ భట్టాచార్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నిజానికి పద్మపురస్కారాలను తిరస్కరించడం చాలా చాలా అరుదుగా జరుగుతుంది. ఎందుకంటే వాటిని ప్రకటించడానికి ముందుగానే ఎంపిక చేసిన అవార్డు గ్రహీతల అంగీకారాన్ని తెలుసుకుంటుంది. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ కూడా పద్మ పురస్కారానికి ఎంపికయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments