Webdunia - Bharat's app for daily news and videos

Install App

పద్మశ్రీ హసన్ సాహెబ్ ది కృష్ణాజిల్లా తిరువూరే! నాద‌స్వ‌ర విధ్వాంసులు!!

Webdunia
బుధవారం, 26 జనవరి 2022 (10:32 IST)
నాదస్వర విధ్వాంసులు దివంగత హసన్ సాహెబ్ కు పద్మశ్రీ ల‌భించ‌డం నాద క‌ళాకారుల‌కు ఎంతో ఆనందాన్ని క‌లిగించింది. ఆయ‌న స్వ‌గ్రామం తిరువూరువాసులు కూడా త‌మ ఊరికి ఘ‌న కీర్తి ల‌భించిందంటున్నారు.
 
 
కృష్ణాజిల్లా తిరువూరుకు చెందిన ప్రముఖ నాదస్వర విద్వాంసులు దివంగత షేక్ హసన్  సాహెబుకు కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డు ప్రకటించింది. గంపలగూడెం మండలం గోసవీడులో జన్మించిన హసన్ సాహెబ్ యాదగిరిగుట్ట, భద్రాచలం దేవస్థానాలలో నిలయ విధ్వాంసులుగా చాలా ఏళ్ల పాటు సేవలు అందించారు. 
 
 
హసన్ సాహెబ్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలోనూ నిలయ విద్వాంసులుగా పనిచేశారు. గత 20 సంవత్సరాల నుండి ఆయన విశ్రాంతి తీసుకుంటూ తిరువూరులోనే స్థిరపడ్డారు. కొద్ది నెలల క్రితమే ఆయన మృతి చెందారు స్థానిక అశోక్ నగర్ లో ఆయన నివాసం ఉండేవారు. మరణానంతరం  హసన్ సాహెబ్ సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డును ప్రకటించింది.

సంబంధిత వార్తలు

సహచర నటి పవిత్ర ఎడబాటును భరించలేక నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య!!

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments