Webdunia - Bharat's app for daily news and videos

Install App

పద్మశ్రీ హసన్ సాహెబ్ ది కృష్ణాజిల్లా తిరువూరే! నాద‌స్వ‌ర విధ్వాంసులు!!

Webdunia
బుధవారం, 26 జనవరి 2022 (10:32 IST)
నాదస్వర విధ్వాంసులు దివంగత హసన్ సాహెబ్ కు పద్మశ్రీ ల‌భించ‌డం నాద క‌ళాకారుల‌కు ఎంతో ఆనందాన్ని క‌లిగించింది. ఆయ‌న స్వ‌గ్రామం తిరువూరువాసులు కూడా త‌మ ఊరికి ఘ‌న కీర్తి ల‌భించిందంటున్నారు.
 
 
కృష్ణాజిల్లా తిరువూరుకు చెందిన ప్రముఖ నాదస్వర విద్వాంసులు దివంగత షేక్ హసన్  సాహెబుకు కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డు ప్రకటించింది. గంపలగూడెం మండలం గోసవీడులో జన్మించిన హసన్ సాహెబ్ యాదగిరిగుట్ట, భద్రాచలం దేవస్థానాలలో నిలయ విధ్వాంసులుగా చాలా ఏళ్ల పాటు సేవలు అందించారు. 
 
 
హసన్ సాహెబ్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలోనూ నిలయ విద్వాంసులుగా పనిచేశారు. గత 20 సంవత్సరాల నుండి ఆయన విశ్రాంతి తీసుకుంటూ తిరువూరులోనే స్థిరపడ్డారు. కొద్ది నెలల క్రితమే ఆయన మృతి చెందారు స్థానిక అశోక్ నగర్ లో ఆయన నివాసం ఉండేవారు. మరణానంతరం  హసన్ సాహెబ్ సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డును ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments