Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానంలో కొట్టుకున్న భార్యాభర్తలు.. ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

Webdunia
బుధవారం, 29 నవంబరు 2023 (17:05 IST)
జర్మనీ నుంచి థాయ్‌లాండ్ వెళుతున్న విమానంలో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు జట్లు పట్టుకుని కొట్టుకున్నారు. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా ఢిల్లీలో ల్యాండింగ్ చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌కు చెందిన నంబరు ఎల్.హెచ్.772 విమానంలో జర్మనీలోని మ్యూనిచ్ నుంచి థాయ్‌లాండ్‌లోని బ్యాంకాంగ్ వెళుతుంది. 
 
అయితే, ఈ విమానం గాల్లో ఉండగా భార్యాభర్తలు గొడవకు దిగారు. ఈ దంపతులిద్దరూ ఘర్షణపడ్డారు. దీంతో విమానంలో గందరగోళం ఏర్పడింది. భార్యాభర్తలిద్దరూ ఒకరిపై ఒకరు దాడికి ప్రయత్నించడంతో వారికి సర్ది చెప్పేందుకు విమాన సిబ్బంది చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో చేసేది లేక విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు యత్నించారు. 
 
అప్పటివరకు పాకిస్థాన్ గగనతలంపైనే విమానం ప్రయాణిస్తుంది. దీంతో పాకిస్థాన్‌లో ల్యాండింగ్ చేసేందుకు అనుమతి కోరగా, పాక్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ అనుమతి నిరాకరించింది. దాంతో ఆ విమానాన్ని ఢిల్లీ వైపు మళ్లించారు. ఢిల్లీలో అధికారులు అనుమతించడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ వెంటనే భద్రతా సిబ్బంది అక్కడకు చేరుకోగా, విమానంలో కీచులాడుకున్న దంపతులను వారికి అప్పగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వరాష్ట్రంలో డిపాజిట్ కోల్పోయిన జోకర్... : ప్రకాష్ రాజ్‌పై నిర్మాత వినోద్ కుమార్ ఫైర్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments