Webdunia - Bharat's app for daily news and videos

Install App

నకిలీ ఓట్ల వ్యవహారం.. ఈసీకి ఫిర్యాదు చేయనున్న ఏపీ మంత్రులు

Webdunia
బుధవారం, 29 నవంబరు 2023 (14:52 IST)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణలో చాలా మంది సీమాంధ్రులకు ఓటు హక్కు ఉన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌తో పాటు ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో సీమాంధ్ర ఓటర్లు గెలుపును నిర్ణయించే స్థాయిలో ఉన్నారు. 
 
అయితే తెలంగాణలో ఓటు హక్కు ఉన్న వారందరికీ ఏపీలో ఓటు హక్కు ఉంది. రెండు రాష్ట్రాల్లో ఓట్లు ఉన్నాయని ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాతో మంత్రులు జోగి రమేష్, మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఈరోజు భేటీ కానున్నారు. 
 
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నకిలీ ఓట్లు, ఓట్ల తొలగింపుపై ప్రతిపక్ష టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ కూడా ఈసీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది. 
 
నకిలీ ఓట్ల నమోదుకు వైసీపీయే కారణమంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణలకు వైసీపీ కౌంటర్‌ ఇస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో నమోదైన నకిలీ ఓట్లను తొలగించాలని ఈసీని కోరడం ద్వారా.. ఓటర్ల నమోదులో తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని వైసీపీ వెల్లడిస్తోంది. 
 
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎన్నికలు జరగనున్నాయి. కాబట్టి తెలంగాణ పాలిట ప్రభావం ఏపీ ఎన్నికలపై పడకుండా వైసిపి జాగ్రత్తపడుతోంది. ఈ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఓటర్లు ఎక్కడో ఒక చోట ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని వైసీపీ నేతలు ఈసీని కోరనున్నారు.
 
ఏపీలో భారీగా నకిలీ ఓట్లు నమోదయ్యాయని టీడీపీ నేతలు ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేశారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు దొంగ ఓట్లను నమోదు చేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఈ నకిలీ ఓట్లపై టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేశారు. 
 
నకిలీ ఓట్ల నమోదుపై వైసీపీ కూడా పలుమార్లు ఈసీకి ఫిర్యాదు చేసింది. సీఈవో మీనాకు మరోసారి ఫిర్యాదు చేయనున్నారు ఏపీ మంత్రులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

జానీ మాస్టర్... మీరు దోషి అయితే... దానిని అంగీకరించండి : మంచు మనోజ్ ట్వసీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments