Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణా ఎన్నికలు : ముగిసిన నామినేషన్ల ప్రక్రియ.. బరిలో 2898 మంది

telangana assembly poll
, మంగళవారం, 14 నవంబరు 2023 (19:06 IST)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా, మంగళవారం సాయంత్రంతో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. ఈ ఎన్నికల్లో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకుగాను 2898 మంది అభ్యర్థులు బరిలో నిలించారు. అన్ని నియోజకవర్గాలకు కలిపి 4798 మంది నామినేషేన్లు దాఖలు చేశారు. 
 
సోమవారం నుంచి జరిగిన స్క్రూటినీలో 608 మంది నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. ఆ తర్వాత ఎన్నికల బరిలో 2898 మంది అభ్యర్థులు నిలిచారు. అత్యధికంగా ముఖ్యమంత్రి, భారాసా అధినేత కేసీఆర్ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఒకటైన గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి 114 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 
 
ఆ తర్వాత మేడ్చల్ స్థానంలో 67 మంది, కామారెడ్డిలో 58 మంది, ఎల్బీ నగర్‌లో 50 మంది, కొండగల్‌లో 15 మంది పోటీలో ఉండగా, అత్యల్పంగా నారాయణ పేట నుంచి కేవలం ఏడుగురు అభ్యర్థులు మాత్రమే బరిలో నిలిచారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోతి దాడిలో పదేళ్ల బాలుడు మృతి.. ఎక్కడ?