Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధామి పట్టణంలో ఒక్కసారిగా కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం

వరుణ్
ఆదివారం, 21 జనవరి 2024 (09:25 IST)
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని సిమ్లాకు సమీపంలోని ధామి పట్టణంలో ఐదు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటన సిమ్లాకు 26 కిలోమీటర్ల దూరంలో జిరగింది. భారీ వర్షాలు, వరదలకు కొండ చరియలు విరిగిపడిన సమయంలో కొండ రాళ్ళ భవనాన్ని బలంగా ఢీకొట్టాయి. దీంతో భవన్ పునాదులు కదిలిపోవడం వల్ల ఈ భవనం కుప్పకూలిపోయివుంటుందని స్థానిక అధికారులు అభిప్రాయపడుతున్నారు. పైగా, ఈ భవనంలోని ప్రజలను ముందుగానే ఖాళీ చేయించడంతో ప్రాణనష్టం లేకుండా పోయింది. 
 
ధామి పట్టణంలోని మరహ్వాగ్ ప్రాంతంలో రాజ్‌ కుమార్ అనే వ్యక్తికి సంబంధించి ఐదు అంతస్తుల భవనం ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు కొండ చరియలు విరిగిపడ్డాయి. రాళ్లు ఈ భవనం గోడలను బలంగా ఢీకొట్టాయి. ఈ క్రమంలో ఇంటిని మరమ్మతు చేయించేందుకు రాజ్ కుమార్ అందరినీ ఖాళీ చేయించారు. 
 
ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. భవనం పరిస్థితిని గమనించిన అధికారులు ముందుగానే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. భవనం కూలిపోవడంతో ధామి డిగ్రీ కాలేజీకి వెళ్ళే రహదారి దెబ్బతింది. భవనం కూలిపోయే దృశ్యానికి సంబంధించిన 15 సెకన్ల వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments