Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ లల్లా విగ్రహం ఫోటోలు లీక్ కావడంపై విచారణ జరిపించాలి : సత్యేంద్ర దాస్

వరుణ్
ఆదివారం, 21 జనవరి 2024 (08:38 IST)
రామ్ లల్లా విగ్రహం ఫోటోలు లీక్ కావడంతో విచారణ జరిపించాలని అయోధ్య రామ మందిర ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ డిమాండ్ చేశారు. ప్రాణప్రతిష్టకు ముందే ఫోటోలు లీక్ కావడంతో ఆయన మండిపడ్డారు. తాము ఎలాంటి ఫోటోలు విడుదల చేయలేదని ఆలయ ట్రస్ట్ ఆఫీస్ బేరర్లు, విశ్వ హిందూ పరిషత్‌ ప్రతినిధులు స్పష్టం చేశారు. 
 
ఈ ఫోటోలు లీక్ కావడంపై సత్యేంద్ర దాస్ స్పందిస్తూ, కళ్లను కప్పి ఉంచని ఫోటోలు లీక్ కావడంపై విచారణ జరిపించాలని కోరారు. ఆలయ గర్భగుడిలో విగ్రహంకళ్లను వస్త్రంతో కప్పివున్న మొదటి ఫోటోను గురువారం విడుదల చేశారు. అయితే, మరుసటి రోజే కళ్లను కప్పివుంచని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఈ విధంగా ప్రాణప్రతిష్టకు ముందే ఫోటోలు లీక్ కావడంపై ఆయన మండిపడ్డారు. 
 
ప్రాణప్రతిష్ట పూర్తికాకముందే రాముడి విగ్రహం కళ్లను బయటకు తెలియజేయనివ్వలేమని సత్యేంద్ర దాస్ అన్నారు. ఆ ఫోటోలను ఎవరు లీక్ చేశారో, ఎలా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయో విచారణ జరగాలని ఆయన కోరారు. కాగా, ప్రాణప్రతిష్టకు ముందు అయోధ్య రామాలయంలో ప్రతిష్టంచనున్న రామ్ లల్లా విగ్రహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments