Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ లల్లా విగ్రహం ఫోటోలు లీక్ కావడంపై విచారణ జరిపించాలి : సత్యేంద్ర దాస్

వరుణ్
ఆదివారం, 21 జనవరి 2024 (08:38 IST)
రామ్ లల్లా విగ్రహం ఫోటోలు లీక్ కావడంతో విచారణ జరిపించాలని అయోధ్య రామ మందిర ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ డిమాండ్ చేశారు. ప్రాణప్రతిష్టకు ముందే ఫోటోలు లీక్ కావడంతో ఆయన మండిపడ్డారు. తాము ఎలాంటి ఫోటోలు విడుదల చేయలేదని ఆలయ ట్రస్ట్ ఆఫీస్ బేరర్లు, విశ్వ హిందూ పరిషత్‌ ప్రతినిధులు స్పష్టం చేశారు. 
 
ఈ ఫోటోలు లీక్ కావడంపై సత్యేంద్ర దాస్ స్పందిస్తూ, కళ్లను కప్పి ఉంచని ఫోటోలు లీక్ కావడంపై విచారణ జరిపించాలని కోరారు. ఆలయ గర్భగుడిలో విగ్రహంకళ్లను వస్త్రంతో కప్పివున్న మొదటి ఫోటోను గురువారం విడుదల చేశారు. అయితే, మరుసటి రోజే కళ్లను కప్పివుంచని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఈ విధంగా ప్రాణప్రతిష్టకు ముందే ఫోటోలు లీక్ కావడంపై ఆయన మండిపడ్డారు. 
 
ప్రాణప్రతిష్ట పూర్తికాకముందే రాముడి విగ్రహం కళ్లను బయటకు తెలియజేయనివ్వలేమని సత్యేంద్ర దాస్ అన్నారు. ఆ ఫోటోలను ఎవరు లీక్ చేశారో, ఎలా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయో విచారణ జరగాలని ఆయన కోరారు. కాగా, ప్రాణప్రతిష్టకు ముందు అయోధ్య రామాలయంలో ప్రతిష్టంచనున్న రామ్ లల్లా విగ్రహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments