Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వంగవీటి రాధాకృష్ణ - పుష్పవల్లి పెళ్లి ముహూర్తం ఖరారు

Advertiesment
radhakrishna - pushpavalli
, ఆదివారం, 8 అక్టోబరు 2023 (16:06 IST)
దివంగత మాజీ నేత వంగవీటి మోహన్ రంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ వివాహం ఈ నల 22వ తేదీన అంరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వివాహానికి విజయవాడ సమీపంలోని మురళి రిసార్ట్ వేదిక కానుంది. 22వ తేదీ ఆదివారం రాత్రి 7.59 నిమిషాలకు వధువు పుష్పవల్లి మెడలో వంగవీటి రాధా మూడు ముళ్లు వేయనున్నారు. 
 
నరసాపురానికి చెందిన జక్కం బాబ్జి, అమ్మాణి దంపతుల కుమార్తె జక్కం పుష్పవల్లితో వంగవీటి రాధకు గత నెల 3వ తేదీన నిశ్చితార్థం జరిగిన విషయం తెల్సిందే. తాజాగా వీరి వివాహ ముహూర్తం ఖరారు చేశారు. ఈ జంట వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వివాహానికి వంగవీటి అభిమానులతో పాటు వీఐపీల తాకిడి అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. దీంతో విజయవాడ - నిడమానూరు పోరంకి రోడ్డులో మురళి రిసార్ట్స్‌లో ఈ పెళ్లి వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
కాగా, గత 2004లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వంగవీటి రాధా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాలంలో ప్రజారాజ్యం పార్టీలో చేరిన ఆయన 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్‌గా ముత్తిరెడ్డి