Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం: ఆస్పత్రిలో భయం భయం.. ఒక రోగి తప్ప..?

Webdunia
శనివారం, 11 జూన్ 2022 (12:42 IST)
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.  ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో, పూత్ ఖుర్ద్‌‌లో ఉన్న.. బ్రహ్మశక్తి ఆస్పత్రిలో మంటలు వ్యాపించాయి. ప్రమాదం ఉదయం 5 గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలో రోగులు, వైద్య సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. బయటకు పరుగులు తీశారు. 
 
అయితే, ఒక రోగి ఐసీయూలో గదిలో ఉన్నాడు. అతను చనిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. మంటలు వ్యాపించడంతో ఆ ప్రాంతంతో దట్టమైన పొగలు వ్యాపించాయి.
 
స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. 
 
మంటలను ఆర్పేందుకు తొమ్మిది ఫైర్ ఇంజిన్‌లను ఆ ప్రాంతంలో తరలించారు. కాగా, వెంటిలేటర్ సపోర్టులో ఉన్న ఒక రోగి తప్ప మిగిలిన వారందరూ సురక్షితంగా రక్షించబడ్డారని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments