Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈఎంఐ కట్టలేదని కిడ్నాప్ చేశారు... చివరికి ఏమైందంటే?

Webdunia
శనివారం, 1 జులై 2023 (22:22 IST)
తమిళనాడులో ఘోరం జరిగింది. అప్పు తీసుకున్న వ్యక్తి పట్ల ఫైనాన్స్ కంపెనీ దారుణంగా ప్రవర్తించింది. ఈఎంఐ కట్టలేదని.. సదరు ఫైనాన్స్ కంపెనీ.. ఆతని కుమార్తెను కిడ్నాప్ చేసిన ఘటన తిరునెల్వేలి జిల్లా మారుత్తూరు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మారుత్తూరు గ్రామానికి చెందిన రాజా ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. 
 
ఫైనాన్స్ కంపెనీ నుంచి రూ. 50 వేలు అతను అప్పు తీసుకున్నాడు. లోన్ తీసుకుని ఈఎంఐలు కట్టాడు. కానీ ఉద్యోగం పోవడంతో డబ్బుల్లేక నానా తంటాలు పడ్డాడు. అయితే అప్పు తీసుకున్న కంపెనీ నుంచి ఒత్తిడి పెరిగింది. 
 
ఓ రోజు ఆ ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగి విఘ్నేష్.. లోన్ తీసుకున్న రాజా ఇంటికి వెళ్లాడు. ఎలాగైనా.. ఈఎంఐ వసూలు చేయాలని అనుకున్నాడు. రాజా ఇంటికి వెళ్లి ఆవేశంలో ఆయన 11ఏళ్ల కుమార్తెను కిడ్నాప్ చేశాడు. 
 
రాజా ఇంటికి వచ్చాక కూతురు కనిపించకపోవడంతో అన్ని చోట్లా వెతకడం ప్రారంభించాడు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకి దిగారు. కిడ్నాప్‌కు గురైన రాజా కుమార్తెను కాపాడి.. విఘ్నేశ్‌ను అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments