Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెక్కీని మోసం చేసిన దొంగ బాబా.. గతజన్మలో నేనే నీ భర్త..

సాంకేతికత ఎంత పెరిగినా.. ఉన్నత చదువులు చదివినా.. బాబాలను నమ్మి మోసపోవడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. తాజాగా ఓ టెక్కీ దొంగ బాబా చేతిలో మోసపోయింది. మహారాష్ట్ర, థానేలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Webdunia
శుక్రవారం, 17 నవంబరు 2017 (14:29 IST)
సాంకేతికత ఎంత పెరిగినా.. ఉన్నత చదువులు చదివినా.. బాబాలను నమ్మి మోసపోవడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. తాజాగా ఓ టెక్కీ దొంగ బాబా చేతిలో మోసపోయింది. మహారాష్ట్ర, థానేలో ఈ ఘటన చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర థానేలో సైలాస్ జోథియా అనే బాబా వుండేవాడు. అతడు గత జన్మలు గురించి చెప్పడం.. వ్యాధులను నయం చేయటాన్ని అలవాటుగా పెట్టుకునేవాడు. తద్వారా అతడు చేసే సేవలకు మూడు లక్షలు తగ్గకుండా వసూలు చేసేవాడు. ఇతని వద్దకు వచ్చి ఓ టెక్కీని కూడా ఇదే తరహాలో మోసం చేశాడు. గత జన్మలో తాను టెక్కీ భర్తనని.. ఆదర్శ దంపతులుగా జీవించామని చెప్పాడు. దీన్ని కూడా ఆమె గుడ్డిగా నమ్మింది. 
 
అంతేగాకుండా ఆమె తండ్రి అనారోగ్యం పాలైతే నయం చేస్తానని చెప్పాడు. కానీ తండ్రి ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో బాబాకు టెక్కీ దూరమైంది. అయినా బాబా ఆమెను వదిలి పెట్టకుండా ఓ సీడీని పంపి రూ.10లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో టెక్కీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగ బాబాను అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments