Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్యసభకు రంజన్ గగోయ్... సభ్యత్వాన్ని ఎందుకు స్వీకరించానో వివరిస్తా

Webdunia
మంగళవారం, 17 మార్చి 2020 (16:45 IST)
ఈశాన్య రాష్ట్రాలకు చెందిన న్యాయకోవిదుడుగా గుర్తింపు పొందిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆయన్ను రాష్ట్రపతి కోటా నుంచి కేంద్ర ప్రభుత్వం పెద్దల సభకు నామినేట్ చేసింది. ఇది ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
ఎందుకంటే.. గతంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులెవ్వరూ ఇలా రాజ్యసభకు నామినేట్ కాలేదు. కొన్ని దశాబ్దాల క్రితం.. మాజీ ప్రధాన న్యాయమూర్తి రంగనాథ్ మిశ్రా కాంగ్రెస్‌లో చేరి ఆ తర్వాత పార్లమెంట్‌ సభ్యుడయ్యారు. 1991లో రిటైర్ అయిన ఆయన 1998 నుంచి 2004 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు.
 
కానీ, ఇపుడు రంజన్ గగోయ్‌ను మాత్రం కేంద్ర ప్రభుత్వం పెద్దల సభకు నామినేట్ చేసింది. ఇపుడుడ ఈ విషయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే, రాష్ట్రపతి ఇచ్చిన ఈ అవకాశాన్ని ఎందుకు స్వీకరించాల్సి వచ్చిందో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే వివరంగా చెబుతానని జస్టిస్ గొగోయ్ అంటున్నారు.
 
ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. "నేను రేపు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. మొదట నన్ను ప్రమాణ స్వీకారం చేయనీయండి. ఆ తర్వాతే మీడియాతో మాట్లాడుతా. ఈ సభ్యత్వాన్ని ఎందుకు అంగీకరించాల్సి వచ్చిందో స్పష్టంగా చెబుతా" అని ఆయన తెలిపారు. దాదాపు 13 నెలల పాటు సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన రంజన్‌ గతేడాది నవంబర్‌‌లో పదవీ విరమణ చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments