Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను వేధించిన భార్య.. ఎందుకోసమో తెలుసా?

భార్యను కట్నం కోసం వేధించే భర్త గురించి వినేవుంటాం. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. భార్య వేధింపులను భరించలేక భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Webdunia
మంగళవారం, 28 ఆగస్టు 2018 (15:05 IST)
భార్యను కట్నం కోసం వేధించే భర్త గురించి వినేవుంటాం. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. భార్య వేధింపులను భరించలేక భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని ఈరోడ్ జిల్లాకు చెందిన రమేశ్ (50) కు భార్య లలిత (45), కుమారుడు శ్రీధర్ ఉన్నాడు. 
 
అయితే రమేష్ పేరు మీద బ్యాంకులో రూ.2 కోట్ల నగదు ఉంది. అంతేకాకుండా ఇళ్లు, షాపులపై నెలకు రూ.30 వేల వరకూ అద్దెలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తల్లీకుమారులు కలిసి ఆస్తి తమ పేరిట రాసివ్వాలని రమేష్‌ను డిమాండ్ చేశారు. ఇందుకు రమేష్ ఒప్పుకోకపోవడంతో వారం రోజుల పాటు చిత్ర హింసలకు గురిచేశారు. ఆదివారం రమేష్ అరుపులు విన్న స్థానికులు బంధువులకు సమాచారం ఇచ్చారు.
 
దీంతో రమేష్‌ను బంధువు గోపాల్ ఈరోడ్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వర్గాల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడంతో పాటు భార్య కుమారుడిని కటకటాల వెనక్కి నెట్టారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments