Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం - ఆ పార్టీలకు జాతీయ హోదా రద్దు.. బీఆర్ఎస్‌కు షాక్

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (08:47 IST)
భారత ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. పలు పార్టీలకు జాతీయ హోదాను రద్దు చేసింది. అలాగే, భారత రాష్ట్ర సమితికి కూడా తేరుకోలేని షాకిచ్చింది. ఆ పార్టీని తెలంగాణ ప్రాంతీయ పార్టీగా గుర్తించింది. పైగా, ఏపీలో ఆ పార్టీకి జాతీయ హోదాను రద్దు చేసింది. అదేసమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి మాత్రం జాతీయ హోదాను కల్పించింది. జాతీయ హోదాను కోల్పోయిన పార్టీల్లో తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, ఎన్సీపీలు ఉన్నాయి. ఈసీ తీసుకున్న నిర్ణయంతో ఈ పార్టీల నేతల తీవ్ర నిరాశకు లోనయ్యారు. 
 
ఆప్ విషయానికి వస్తే ఢిల్లీలో పురుడు పోసుకున్న ఈ పార్టీ క్రమంగా ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరిస్తుంది. పంజాబ్‌లో అధికారంలోకి వచ్చింది. మరికొన్ని రాష్ట్రాల్లో పాగా వేసేందుకు వేగంగా అడుగులు వేస్తుంది. 
 
ముఖ్యంగా, గత యేడాది జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ ఏకంగా ఐదు చోట్ల విజయం సాధించి, తన ఉనికిని చాటుకుంది. గుజరాత్ బరిలో దికిన తొలిసారే ఏకంగా ఐదు స్థానాల్లో గెలుపొందడం సాధారణ విషయం కాదు. మరోవైపు, సీపీఐ, టీఎంసీ, ఎన్సీపీలకు జాతీయ హోదాను రద్దు చేస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయం ఆ పార్టీల నేతలకు ఏమాత్రం రుచించడం లేదు. మరోవైపు, ఏపీలో భారత రాష్ట్ర సమితికి జాతీయ హోదాను ఉపసంహరించుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలు మీ సమస్య ఏంటి? జర్నలిస్టుపై మండిపడిన పూజాహెగ్డే

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

మండుతున్న అగ్నిగోళం నుంచి చందమామ చల్లగా ఎలా మారాడు? 4.5 బిలియన్ ఏళ్ల క్రితం (video)

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments